స్వీట్స్ ఎక్కువగా తినడం వల్ల క్యాన్సర్ వస్తుందా.. నిపుణ‌లు ఏం చెప్తున్నారంటే..?!

స్వీట్స్ ఇష్టపడని వారంటే ఎవరు ఉండరు. ఆ పేరు తలుచుకోగానే నోట్లో నీళ్లు ఊరుతూ ఉంటాయి. అయితే దాదాపు అన్ని స్వీట్లు పంచదారతోనే తయారు చేస్తూ ఉంటారు. కాగా పంచదారను ఎక్కువగా తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు చెప్తున్నారు. షుగర్ పేషెంట్లు మాత్రమే కాదు ఎవరు స్వీట్లను ఎక్కువగా తిన్న షుగర్ కంటే భయంకరమైన వ్యాధులు కూడా వస్తున్నాయని.. ఇటీవల సర్వేలో వెళ్లడయింది. అవేంటో ఒకసారి చూద్దాం. సాధారణంగా టీ, కాఫీ, స్వీట్లు ఇలా మనం నిత్యం తీసుకునే ఏదో ఒక దానిలో చక్కెరను వాడుతూనే ఉంటాం.

చాలామంది షుగర్ ఎక్కువ వేసుకొని మరి టీ, కాఫీలను ఆస్వాదిస్తూ ఉంటారు. కొందరు ఏకంగా స్వీట్లు ఎక్కువగా తినడానికి ఇష్టపడుతూ ఉంటారు. కేకులు, చాక్లెట్లు, ఐస్క్రీమ్లు ఇలా వేటిలోనైనా ఇప్పుడు అదనపు చెక్కర ఉంటూనే ఉంటుంది. చక్కెరతో చేసిన వాటిని అధికంగా తీసుకోవడం వల్ల హైకొల స్ట్రాల్‌, షుగర్ లాంటి సమస్యలు ప్రతి ఒక్కరిలోనూ కనిపిస్తున్నాయి. చెక్కెరను మితిమీరు తీసుకుంటే క్యాన్సర్ కూడా వస్తుందని తాజాగా బెల్జియం నిపుణులు పరిశోధనలో వివరించారు.

షుగర్ కలిపిన స్వీట్న ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో క్యాన్సర్ గడ్డలు పెరిగే అవకాశాలు ఉన్నాయని.. 9 ఏళ్ల సుదీర్ఘ అధ్యయనం తర్వాత నిపుణులు కనుగొన్నారు. తినుబండారాలు, మిఠాయిలు ఇతర ఆహార పదార్థాలలో చక్కెర పులిసిపోవడంతో శరీరంలో క్యాన్సర్ కణాల శక్తిని పుంజుకుంటున్నాయని.. నిపుణులు ధ్రువీకరించారు. క్యాన్సర్ కణాలు పెరుగుదలకు చక్కెర పులిసిపోవడం ప్రధాన కారణంగా ఉందని.. తీయగా ఉండే షుగర్ లో ఎన్నో ప్రమాదాలు ఉన్నాయని.. సాధార‌ణంగా పంచదారను చాలా తక్కువ లిమిట్ లో వాడడం మంచిదంటూ నిపుణులు చెబుతున్నారు.