“ఆ ఎన్టీఆర్ ఫోటోలు పీకేయండి రా”.. కార్యకర్తలకు బాలయ్య స్ట్రిక్ట్ ఆర్డర్.. వీడియో వైరల్..!!

నేడు టిడిపి వ్యవస్థాపకుడు దివంగత మాజీ సీఎం ఎన్టీఆర్ వర్ధంతి . ఈ సందర్భంగా హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఆయన కుమారులు ..మనవళ్లు ఇతర కుటుంబ సభ్యులు నివాళులర్పించారు . దీనికి సంబంధించిన ఫొటోస్ వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముందుగా జూనియర్ ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్ నివాళులర్పించి వెళ్లిపోయారు . ఆ తర్వాత అక్కడికి చేరుకున్న బాలకృష్ణ తదితరులు ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించారు .

అయితే ఇలాంటి క్రమంలోనే ఎన్టీఆర్కు నందమూరి కుటుంబంతో ఉన్న విభేదాల గురించి ఓ న్యూస్ బయటపడింది. సీనియర్ ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ ల తో పాటు హరికృష్ణ, కళ్యాణ్ రామ్ ఫోటోలతో కూడిన కొన్ని ఫ్లెక్సీలను జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఏర్పాటు చేశారు . అయితే జూనియర్ ఎన్టీఆర్ అక్కడి నుంచి వెళ్లిన కొద్దిసేపటికి నందమూరి బాలకృష్ణ ..ఎన్టీఆర్ ఘాట్ కి చేరుకొని నివాళులర్పించారు.

ఆ తర్వాత బాలకృష్ణ గారు అలా వెళ్లారో లేదో కొంతమంది జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలను అక్కడ నుంచి తొలగించారు. బాలకృష్ణ చెప్తేనే జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలను తొలగించారు అన్న ప్రచారం ఇప్పుడు ఊపందుకుంది. అందుకు సంబంధించిన ఒక వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . దీంతో సోషల్ మీడియాలో ఇదే న్యూస్ ఇప్పుడు హాట్ హాట్ గా ట్రెండ్ అవుతుంది..!!