గతంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, వక్కంతం వంశీ కాంబోలో సినిమా రాబోతుందంటు వార్తలు వైరల్ అయిన సంగతి తెలిసిందే. వాస్తవానికి ఎన్టీఆర్ జై లవకుశ ప్లేస్ లో వక్కంతం వంశీ డైరెక్షన్లో సినిమా రావాల్సి ఉంది. అయితే ఆ ప్రాజెక్ట్ ఎందుకో ముందుకు వెళ్లలేదు. ఆ ప్రాజెక్ట్ హోల్డ్ లో పడడానికి గల అసలు కారణాలు ఏంటో చాలామందికి తెలియదు. దీంతో ఎన్టీఆర్ – వక్కంతం వంశీ మధ్యన జరిగిన గొడవలే ఈ సినిమా హోల్డ్ లో పడడానికి కారణం అంటూ పలు వార్తలు వినిపించాయి. ఇక తాజాగా వక్కంతం వంశీ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ ప్రశ్నకు సమాధానం ఇచ్చాడు.
కథకు సంబంధించిన సమస్యల కారణంగానే జూనియర్ ఎన్టీఆర్ తో తీయవలసిన సినిమా ఆగిపోయిందని.. తయారు చేసిన కథను పూర్తిస్థాయి సినిమాగా చేద్దామని కాన్ఫిడెన్స్ ఇద్దరికీ లేకపోవడంతో ఈ సినిమాను ఆపేసామని చెప్పుకొచ్చాడు. ఒక్కొక్క స్టోరీకి ఒక్కో ప్రాబ్లం ఉంటుంది.. మరో సినిమా చేసుకొని వస్తాను అని ప్రాజెక్ట్ నుంచి బయటకు వచ్చేసా అంటూ వక్కంతం వంశీ వివరించాడు. ఇక సాధారణంగా నేను చిరంజీవికి బిగ్గెస్ట్ ఫ్యాన్ అని.. పర్సనల్ ట్రావెలింగ్ లో జూనియర్ ఎన్టీఆర్ అభిమనిని అంటూ వెల్లడించాడు. ఎన్టీఆర్తో నేను సినిమా చేయకపోవడంతో పలు ప్రచారాలు బయటకు వచ్చాయని.. అవేవీ కరెక్ట్ కాదని చెప్పుకొచ్చాడు.
ఒక చిరంజీవితో ఓ సినిమా చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు వంశీ చెప్పుకొచ్చాడు. ఇక తన దర్శకత్వంలో వచ్చిన నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా మూవీ నచ్చిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు అంటూ చెప్పుకొచ్చాడు. రేసుగుర్రం లాంటి ఎంటర్టైన్మెంట్లు చూసిన ప్రేక్షకులు నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా కథ తీసుకోలేకపోయారని.. అందుకే ఈ సినిమా ప్రేక్షకులు మెప్పించలేకపోయింది అంటూ చెప్పుకొచ్చిన వంశీ.. డైరెక్టర్ గా ఆ సినిమా నాకు మంచి పేరు తెచ్చి పెట్టింది అంటూ కామెంట్ చేశాడు. ఇక ఈ సినిమా స్టోరీని బన్నీ సింగల్ సిట్టింగ్లోనే ఓకే చేశారంటూ చెప్పుకొచ్చాడు.