వేణు స్వామితో రహస్య పూజలు జరిపించుకున్న రష్మిక… ఎందుకో తెలుసా…!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. చలో సినిమాతో ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ… మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని దక్కించుకుంది. ఇక ఆ సక్సెస్ అలానే కొనసాగిస్తుంది. ఇక తాజాగా వచ్చిన ” యానిమల్ ” మూవీలో హీరోయిన్గా నటించి ఎంతోమంది ప్రేక్షకుల మనసులను గెలుచుకుంది.

ఇక ఇలాంటి నేపథ్యంలోనే రష్మిక గురించి కొన్ని ఆసక్తికర విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రముఖ జ్యోతిష్కుడు వేణు స్వామి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. యూట్యూబ్ లో నిత్యం కనిపిస్తూ.. ఏదో ఒక బాంబ్ పెడుతూ ఉంటాడు వేణు స్వామి.

అలాగే చాలామంది హీరోయిన్లకు రాజశ్యామల యాగం కూడా చేస్తాడు. ఇక ప్రస్తుతం రష్మిక కూడా రహస్యంగా వేణు స్వామితో.. రాజశ్యామల యాగం చేపించుకుందట. ఇక ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఈ ముద్దుగుమ్మ ఈ పూజ చేయించుకోవడానికి కారణం ఏంటి అనేది తెలియాల్సి ఉంది.