సూర్య – జ్యోతిక డివోర్స్.. అందుకే ముంబై వెళ్లిపోయిన జ్యోతిక.. నిజం ఏంటంటే..?

తెలుగు స్టార్ కపుల్స్ సూర్య – జ్యోతికకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఇండస్ట్రీలో మోస్ట్ అవైలబుల్ కపుల్స్ లో టాప్ 5 లిస్టులో ఈ జంట ఎప్పుడూ ఉంటారు. అన్నడంలో సందేహం లేదు. ఎప్పుడు బయట కనిపించినా సరే ఇద్దరు జంటగా, ఎంతో అన్యోన్యంగా కనిపిస్తూ ఉంటారు. ఇక సోషల్ మీడియా యుగం ప్రారంభమైన తర్వాత సెలబ్రిటీస్ ప్రైవసీ లైఫ్ కూడా బహిరంగం అయిపోయింది. ఒక వారం రోజులు కంటే ఎక్కువగా భార్య భర్తల దూరంగా ఉన్న.. భర్త ఒకచోట, భార్య ఒకచోట విడివిడిగా ఉంటున్న సరే వారిద్దరు విడాకులు తీసుకోబోతున్నారంటూ వార్తలు తెగ వైరల్ అయిపోతున్నాయి.

గత కొన్ని రోజులుగా జ్యోతిక ముంబైలో వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర తన పిల్లలతో కలిసి ఉంటుంది. సూర్య ఒక్కడే చెన్నైలో ఉండడంతో వీరిద్దరు డివోర్స్ తీసుకున్నారని త్వరలోనే విడిపోబోతున్నారంటూ వార్తలు వైరల్ అయ్యాయి. ఈ ఏడది సూర్య దానిపై స్పందిస్తూ ఫుల్ క్లారిటీ ఇచ్చాడు. పిల్లలు చదువుల రిత్యా ముంబైలో ఉండాల్సి వస్తుందని.. తను మాత్రం షూటింగ్స్ కోసం చెన్నై – ముంబై తిరుగుతూ ఉన్నానని వివరించాడు. అయితే ఇంకా ఈ రూమర్లు ఎక్కువ కావడంతో జ్యోతిక తాజాగా వీటిపై క్లారిటీ ఇచ్చింది.

ఓ వీడియోలో ఆమె దీనిపై స్పందించింది. ఆమె మాట్లాడుతూ తన అమ్మానాన్న చూసుకోవడానికి తన ముంబైలో ఉన్నారని వివరించింది. తల్లిదండ్రులను చూసుకోవడం నా బాధ్యత.. నేను వివాహమైన తరువాత చాలా కాలం పాటు వారిని చూసుకోలేక పోయా.. కరోనా టైంలో కూడా వారిని చాలా తక్కువ సార్లు కలిసా అంటూ చెప్పుకొచ్చింది. వారిని చూసుకునే బాధ్యత నాపై ఉంది అందుకే నేను ప్రస్తుతం అమ్మానాన్నకు తోడుగా ముంబైలో ఉంటున్న.. పిల్లల చదువుల రిత్యా వారిని కూడా ఇక్కడికే తీసుకురావాల్సి వచ్చింది అంటూ చెప్పుకొచ్చింది.

Karthi Opens Up On Anna-Vadina Breakup Rumours

సూర్య చాలా మంచి వ్యక్తి.. ఆయన నాకు ఎప్పుడూ సపోర్టివ్ గా ఉంటాడు.. ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే నేను ముంబైలో ఉంటున్న మాట నిజమే కానీ కేవలం అమ్మా నాన్న కోసమే.. వారి ఆరోగ్య సరిగా ఉండకపోవడంతో శ్రద్ధ తీసుకోవడానికి ఇక్కడికి వచ్చా. దయచేసి మేమిద్దరం విడిపోతున్నాం అంటూ వార్తలు స్ప్రెడ్ చేయడం మానేయండి. మేము డివోర్స్ ఏమి తీసుకోవడం లేదు అంటూ క్లారిటీ ఇచ్చింది. దీంతో జ్యోతిక – సూర్య విడాకుల వార్తలకు చేక్ పడింది.