“తలకిందులుగా తపస్సు చేసిన వాళ్ల పప్పులు ఉడకవ్”.. నందమూరి బ్లడ్ అంటే అంతేగా మరి..!

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక తలా తోక లేని వార్తలు ఎన్ని వైరల్ అవుతున్నాయో మనం చూస్తున్నాం. మరీ ముఖ్యంగా స్టార్ సెలబ్రెటీస్ ని టార్గెట్ చేస్తూ కొంత మంది విచ్చలవిడిగా పుకార్లు పుట్టించేస్తున్నారు . కాగా గత కొన్ని రోజుల నుంచి నందమూరి హీరోలు కళ్యాణ్ రామ్ – ఎన్టీఆర్ లపై కొందరు కావాలనే ట్రోలింగ్ స్టార్ట్ చేశారు . నందమూరి కళ్యాణ్ రామ్ మధ్య గొడవలు స్టార్ట్ అయ్యాయని అందుకే బింబిసారా-అమిగోస్ సినిమాలకు సపోర్ట్ చేసిన ఎన్టీఆర్ డెవిల్ సినిమాకు సపోర్ట్ చేయడం లేదని …

మరో రెండు రోజుల్లో బ్రదర్ సినిమా పెట్టుకొని ప్రమోషన్స్ చేయకుండా జపాన్ కి వెకేషన్ కి వెళ్లడం విచిత్రంగా ఉంది అంటూ నోటికొచ్చిన విధంగా ట్రోల్ చేశారు. అయితే వాళ్లందరికీ చెక్ పెడుతూ కళ్యాణ్ రామ్ దిమ్మ తిరిగిపోయే కౌంటర్స్ వేశారు . “ఎవరు ఎన్ని పుల్లలు పెట్టాలనుకున్న.. అది జరగదు.. నేను నా బ్రదర్ ఎప్పుడు కలిసే ఉంటాం .. మాది జన్మజన్మలకు విడదీయరాని బంధం .. పుకార్లు పుట్టించే వాళ్ళు పుట్టించుకోండి “..

“వాళ్లకు తెలియదుగా మా మధ్య ఇంత స్ట్రాంగ్ బాండింగ్ ఉంది అనేది”.. అంటూ సైలెంట్ గానే ఘాటుగా రాడు దించేశాడు . దీంతో నందమూరి బ్లడ్ అంటే అదే అని ఎక్కడ కొట్టాలో అక్కడే కొడతారు అని నందమూరి ఫ్యాన్స్ కళ్యాణ్ రామ్ ను పొగుడుతూ కామెంట్స్ చేస్తున్నారు. డేవిల్ సినిమా ఈ నెల 29 న రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా ఖచ్చితంగా పెద్ద హిట్ అవుతుంది అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు జనాలు..!!