కన్నడ స్టార్ హీరో యష్.. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన కే జి ఎఫ్ సిరీస్ లతో భారీ బ్లాక్ బాస్టర్ హిట్లు కొట్టి తనకంటూ ఓ ప్రత్యేకమైన క్రేజ్ సంపాదించుకున్నాడు. ఈ సినిమాతో స్టార్ హీరోగా మారిపోయిన యష్ తన తర్వాత ప్రాజెక్ట్ కోసం చాలా గ్యాప్ తీసుకున్నాడు. ఇక తాజాగా తన 19వ సినిమా టాక్సిక్ను అనౌన్స్ చేశాడు యంగ్ హీరో. గీత మోహన్దాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో కెవిఎన్ ప్రొడక్షన్స్, మాస్టర్ మైండ్ క్రియేషన్స్ బ్యానర్ పై సంయుక్తంగా రూపొందుతుంది.
అయితే కే జి ఎఫ్ తర్వాత చాలా గ్యాప్ తో యష్ నటిస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఇక తాజాగా ఈ సినిమా షూటింగ్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో మిగిలిన స్టార్స్ అందరిని ఫిక్స్ చేసే పనిలో ఉన్నారు మూవీ టీం. ఇందులో ఇద్దరు స్టార్ హీరోయిన్లు నటించబోతున్నట్లు తెలుస్తుంది. వారిలో ఒక పాత్ర కోసం సాయి పల్లవిని ఫిక్స్ చేశారని ఇప్పటికే సోషల్ మీడియాలో వార్తలు వినిపించాయి. అయితే సాయి పల్లవితో పాటు మరో స్టార్ హీరోయిన్ అయినా శృతిహాసన్ కూడా ఈ సినిమాల్లో నటించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయట.
అయితే వీరిద్దరూ కూడా ఈ మూవీ లో నటించటానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారంటూ తెలుస్తుంది. దీనిపై అధికారిక ప్రకటన రాలేదు. సాయి పల్లవి ప్రస్తుతం నాగచైతన్యతో కలిసి తాండేల్ సినిమాలో నటిస్తుంది. ఇక శృతిహాసన్ ప్రభాస్తో కలిసి సలార్లో నటించింది. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. దీంతో పాటు అడవి శేష్తో మరో పాన్ ఇండియా లెవెల్ మూవీలో శృతి నటించబోతోంది. ఇక టాప్ సిక్స్ సినిమాలో సాయి పల్లవి, శృతిహాసన్ నటించబోతున్నారో లేదో తెలియాలంటే మేకర్స్ అఫిషియల్ అనౌన్స్మెంట్ వచ్చే వరకు వేచి చూడాల్సిందే.