బిగ్ బాస్ సీజన్ 7 ఇంకా మూడు వారాలు మాత్రమే మిగిలి ఉంది. గత వారం డబల్ ఎలిమినేషన్ జరగగా.. ప్రస్తుతం హౌస్ లో 8 మంది కంటెస్టెంట్స్ మాత్రమే మిగిలి ఉన్నారు. ఈవారం నామినేషన్ ప్రక్రియ పూర్తికాగా.. పల్లవి ప్రశాంత్, శివాజీ, గౌతమ్, ప్రియాంక, యావర్, అర్జున్, శోభా శెట్టి నామినేషన్స్ లో ఉన్నారు. ఇక ఈ సీజన్లో టికెట్టు ఫినాలే రేస్ స్టార్ట్ అయింది.
అయితే.. ప్రతి సీజన్ లో ఉండే టికెట్ టు ఫినాలే పేరును మార్చి ” ఫినాలే అస్త్ర ” అని పెట్టాడు బిగ్ బాస్. ఈ ఫినాలే అస్త్రన్ని గెలుచుకునేందుకు హౌస్ మేట్స్ కు ఓ ఛాలెంజ్ విసిరాడు బిగ్ బాస్. ఇందులో భాగంగా కంటెస్టెంట్స్ అందరూ ఓ రౌంట్ సర్కిల్ పై ఉన్న బండపై నిలబడి ఉండాలి. ఆ సర్కిల్ మధ్యలో ఉన్న ఓ రాడ్ తిరుగుతూ ఉంటుంది.
అది వాళ్ళ దగ్గరకు వచ్చినప్పుడు దానిని కంటెస్టెంట్స్ దాటాల్సి ఉంటుంది. పొరపాటున ఆ రాడ్ కంటిస్టెంట్ కాళ్ళకి తగిలితే వాళ్లు అవుట్ అని బిగ్ బాస్ అనౌన్స్ చేశారు. ఇక గేమ్ స్టార్ట్ కావడంతో శోభా శెట్టి, శివాజీ, అమర్, యావర్, గౌతమ్, ప్రశాంత్ పడిపోయారు. ఇక ఫైనల్ గా అర్జున్, ప్రియాంక ఈ రేసులో నిలిచారు. ఈ రేసులో ప్రియాంక గెలిచింది. కేవలం ఈ ఒక్క టాస్క్ తోనే ఫినాలే అస్త్ర గెలుచుకోవడం అసాధ్యం. ఈవారం అంతా బిగ్ బాస్ పెట్టే టాస్కుల్లో వాళ్ళ శక్తి చూపించి ఈ వారం ఫైనలిస్ట్ ఎవరు అవుతారు చూద్దాం.