రాజమౌళి పై గుర్రుగా ఉన్న దగ్గుబాటి ఫ్యామిలీ..? అంత తప్పు ఏం చేసారో తెలుసా..?

సినిమా ఇండస్ట్రీలో దర్శకధీరుడు రాజమౌళికి ఎలాంటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . మరీ ముఖ్యంగా ఆర్ఆర్ఆర్ సినిమాకు గాను ఆస్కార్ అవార్డు అందుకున్న తర్వాత ఆయన పేరు మరింత స్థాయిలో పాపులారిటీ అవ్వడమే కాకుండా ఆయనకు సంబంధించిన విషయాలు గ్లోబల్ స్థాయిలో ట్రెండ్ అవుతున్నాయి . ఈ క్రమంలోనే రాజమౌళి చేసిన తప్పులు మరోసారి నెట్టింట ట్రెండ్ చేస్తున్నారు కొందరు ఆకతాయిలు .

కాగా టాలీవుడ్ దర్శకధీరుడు అని పేరు సంపాదించుకున్న రాజమౌళి డైరెక్షన్లో సినిమా చేయాలి అని చాలామంది నటులు ఆశపడుతూ ఉంటారు . బడాబడా స్టార్ హీరోలు కూడా రాజమౌళితో ఒక్క సినిమా చేసే ఛాన్స్ వస్తే బాగుంటుంది అంటూ కోరుతూ ఉంటారు . ఆ లిస్టులోకే వస్తాడు ఫ్యామిలీ హీరో దగ్గుబాటి వెంకటేష్ . నిజానికి మగధీర సినిమా టైంలోనే దగ్గుబాటి వెంకటేష్ తో రాజమౌళి ఓ సినిమాను తెరకెక్కించాల్సి ఉందట . వెంకటేష్ ఎంతో డ్రీం ప్రాజెక్టుగా భావించే “స్వామి వివేకానంద” చరిత్రను బయోపిక్ ల తెరకెక్కించాలని చాలా ఇష్టపడుతున్నాడు వెంకటేష్.

ఈ సినిమాను రాజమౌళిని తెరకెక్కించాలి అని అప్పట్లో వెంకటేష్ గట్టిగా అనుకున్నారట. అంతే కాదు రాజమౌళి కూడా దానికి సై అంటూ ప్రామిస్ కూడా చేశారట. ఆ తర్వాత మగధీర హిట్ అవ్వడంతో.. ఆయన రేంజ్ క్రేజ్ రెండు మారిపోవడంతో వరుస ప్రాజెక్టులతో బిజీ అయిపోయాడు రాజమౌళి. ఆ తర్వాత వెంకటేష్ “స్వామి వివేకానంద” ప్రాజెక్టు అటకెక్కించేశారు . ఆ టైంలో దగ్గుబాటి ఫ్యామిలీ మెంబర్స్ చాలా హర్ట్ అయ్యారట. అసలు రాజమౌళి ఎప్పుడు ఖాళీ అవుతాడో.. అసలు ఈ ప్రాజెక్ట్ తెరకెక్కుతుందో లేదో ఆ దేవుడికే తెలియాలి..!!