“డబుల్” ఇస్మార్ట్ కోసం “ట్రిపుల్” పారితోషకం.. ఈ బేబీ బాగా స్పీడ్ రా బాబోయ్..!?

సినిమా ఇండస్ట్రీలో ఈ మధ్యకాలంలో హీరోయిన్స్ ఎలా రెచ్చిపోయి హాట్ హాట్ సీన్స్ లో నటించడానికి ఓకే చేస్తున్నారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . అంతేకాదు అలా నటించినందుకు ఏకంగా కోట్లు రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్నారు . అయితే ఇండస్ట్రీలో ఉండే స్టార్ హీరోయిన్ లు అలా కోట్లు డిమాండ్ చేసిన పర్లేదు అనుకోవాలి . కానీ నిన్న కాకమొన్న ఇండస్ట్రీ లోకి వచ్చి ఒక్కటంటే ఒక్క హిట్ కొట్టి ఏకంగా కోటి రూపాయలు డిమాండ్ చేస్తుంది అంటే మాత్రం అదికూసింత ఓవరాక్షన్ అంటున్నారు అభిమానులు . ఆ హీరోయిన్ మరెవరో కాదు వైష్ణవి చైతన్య.

ప్రముఖ యూట్యూబర్ గా పాపులారిటీ సంపాదించుకున్న వైష్ణవి చైతన్య రీసెంట్గా ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా ఎంట్రీస్తూ చేసిన సినిమా బేబీ . ఈ సినిమా ఎంత సూపర్ డూపర్ హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . పెట్టిన దానికి ఐదురెట్లు లాభాలు తీసుకొచ్చి 75 కోట్లు కలెక్ట్ చేసి సినిమాని సూపర్ డూపర్ హిట్ గా బాక్స్ ఆఫీస్ వద్ద నిల్చొపెట్టింది . ఈ సినిమా హిట్ అవ్వడానికి మెయిన్ రీజన్ వైష్ణవి చైతన్య అంటూ అందరు చెప్పుకుంటున్నారు .

అంతేకాదు ఈ సినిమాలో అమ్మడు పెర్ఫార్మెన్స్ టూ హాట్ గా ఉండడంతో ఆమెకు ఆఫర్లు సైతం క్యూ కడుతున్నాయి . అయితే రీసెంట్గా నటిస్తున్న డబుల్ ఇస్మార్ట్ సినిమాలో ఆమెకు సెకండ్ హీరోయిన్గా ఛాన్స్ వచ్చినట్లు ప్రచారం జరుగుతుంది. దీనికోసం ఏకంగా పూరి జగన్నాధ్ ని కోటి రూపాయలు డిమాండ్ చేసిందట. దీంతో జనాలు సైతం షాక్ అయిపోతున్నారు. . ఇండస్ట్రీలోకి హీరోయిన్గా రావడమే గొప్ప అనుకుంటున్నా రోజుల్లో నీకు ఆఫర్ ఇచ్చి ఇలాంటి హిట్ ట్రాక్ పెడితే .. ఇప్పుడు నువ్వు ఇలాంటి కండిషన్స్ పెడుతున్నావా..? అంటూ ఫైర్ అయిపోతున్నారు . మొత్తానికి బేబీ స్పీడ్ మామూలుగా లేదుగా అంటూ కుర్రాళ్ళు సైతం హాట్ కామెంట్స్ చేస్తున్నారు. బేబీ సినిమాకి వైష్ణవి చైతన్య తీసుకున్న రెమ్యూనరేషన్ తో కంపేర్ చేస్తే ఇది ఏకంగా ట్రిపుల్ స్థాయిలో ఉంది అంటూ మేకర్స్ మండిపడుతున్నారు..!!