“భోళా శంకర్” సినిమాని రిజెక్ట్ చేసిన ఆ లక్కి హీరో ఎవరో తెలుసా..? బ్రతికిపోయాడు..!!

ప్రజెంట్ మెగా అభిమానులు ఎంతో ఆశగా ఈగర్ గా వెయిట్ చేస్తున్న సినిమా “భోళా శంకర్”. సెకండ్ ఇన్నింగ్స్ లో వరుస సినిమాలతో దూసుకుపోతున్న మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న ఈ సినిమా ఆగస్టు 11న గ్రాండ్గా థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాలో చిరంజీవికి జోడిగా అందాల ముద్దుగుమ్మ మిల్కీ బ్యూటీ తమన్నా నటిస్తూ ఉండగా హీరోయిన్ కీర్తి సురేష్ ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవికి చెల్లెలి పాత్రలో కనిపించబోతుంది.. ఆమె భర్తగా యంగ్ హీరో సుశాంత్ కనిపించబోతున్నాడు. ఫుల్ టు ఫుల్ సిస్టర్ సెంటిమెంట్ సినిమాగా తెరకెక్కిన ఈ మూవీ పై మెగా ఫ్యాన్స్ హ్యూజ్ రేంజ్ లో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని ఉన్నారు.

కాగ గాడ్ ఫాదర్..వాల్తేరు వీరయ్య సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్లు అందుకున్న చిరంజీవి భోళా శంకర్ సినిమాతో సైతం అదే హిట్ అందుకొని హ్యాట్రిక్ హిట్లని తన ఖాతాలో వేసుకోబోతున్నాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా ఈ క్రమంలోనే ఈ సినిమా కథ చిరంజీవి కన్నా ముందే వేరే హీరో దగ్గరకు వెళ్లిందని .. ఆయనకి కూడా కథ బాగా నచ్చిందని .. కాకపోతే టైం లేక ఈ సినిమాని వదిలేసుకున్నాడు అని తెలుస్తుంది. ఆ హీరో మరెవరో కాదు స్వయాన చిరంజీవి తమ్ముడు పవన్ కళ్యాణ్ .

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఖాతాలోకి ఈ సినిమా వెళ్లాల్సింది. వేదాళం సినిమా రీమిక్స్ చేయాలని ఎప్పటినుంచో పవన్ కళ్యాణ్ ట్రై చేస్తున్నారట . సరైన డైరెక్టర్ కోసం చూస్తూ ఉండగా ఈలోపే ఆ సినిమాను మహర్ రమేష్ పట్టేసుకున్నాడు. దీంతో పవన్ కళ్యాణ్ ఈ సినిమాని రీమిక్స్ చేయాలని చూస్తున్నాడని తెలిసి మెహర్ రమేష్ ఆయన వద్దకు వెళ్లి మిగతా డీటెయిల్స్ చెప్పారట . అయితే పాలిటిక్స్ లో బిజీగా మారిపోయిన పవన్..అన్నయ్య తో ఈ సినిమా చేయ్యండి అంటూ సజెస్ట్ చేశారట . ఫైనల్లీ చిరంజీవి ఈ సినిమాకి ఆప్ట్ అంటూ జనాలు సైతం కామెంట్స్ చేస్తున్నారు . అయితే నిజానికి ఈ సినిమా పవన్ కళ్యాణ్ కన్నా చిరంజీవికే బాగుంటుంది అనేది జనాల అభిప్రాయం . అందుకే ఈ సినిమాను రిజెక్ట్ చేసి లక్కీ హీరోగా మారిపోయాడు పవన్ కళ్యాణ్ .