సమంతను జనాలు ఇంత లైట్ గా తీసుకునేసారా.. ఆఖరికి అలా కంపేర్ చేస్తున్నారా..?

సినిమా ఇండస్ట్రీ అంటేనే రంగుల ప్రపంచం. ఇది ఓ మాయలోకం .. ఎప్పుడు ఏదైనా జరగొచ్చు.. ఏం జరిగినా ఆశ్చర్యపోనవసరం లేదు ..షాక్ అవ్వాల్సిన పని అంతకన్నా లేదు అని ఇండస్ట్రీలో ఎంతోమంది స్టార్ హీరోయిన్స్ ప్రూవ్ చేశారు . సినిమా ఇండస్ట్రీ పై ఉండే మోజుతో ఇండస్ట్రీలోకి వచ్చి ఆ తర్వాత స్టార్ హీరోయిన్గా మారి బంగారం లాంటి భవిష్యత్తును పాడు చేసుకుని ముద్దుగుమ్మలు ఎంతోమంది ఉన్నారు. అయితే తాజాగా అదే లిస్టులోకి యాడ్ అయిపోయింది టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకున్న సమంత అంటూ ప్రచారం జరుగుతుంది .

మనకు తెలిసిందే ప్రెసెంట్ సమంత పరిస్థితి అటు రోలు కి ఇటు రోకలికి కానీ పచ్చడి గా మిగిలిపోయింది . అటు ఏ సినిమా పడితే ఆ సినిమా చేయలేక.. తనకు నచ్చిన సినిమాలు చేసేందుకు వీళ్లు లేదు ..అలాంటి సిచువేషన్ లో ఉండిపోయింది సమంత . రీసెంట్ గానే మయోసైటిస్ వ్యాధి కోసం మళ్లీ చికిత్స తీసుకోవడానికి అమెరికా వెళ్లడానికి సినిమాలకు బ్రేక్ చెప్పిన సమంత ..తాను కమిట్ అయిన సినిమాల షూటింగ్స్ ను కంప్లీట్ చేసింది .

విజయ్ దేవరకొండ తో కలిసి ఖుషి , వరుణ్ ధావన్ తో కలిసి సిటాడిల్ వెన్ సిరీస్ ను కంప్లీట్ చేసుకున్న సమంత పై జనాలు విపరీతమైన ట్రోల్స్ చేస్తున్నారు . దానికి కారణం రీసెంట్గా ఖుషి సినిమా నుంచి రిలీజ్ అయిన టైటిల్ సాంగ్ అంటూ తెలుస్తుంది . ఈ సాంగ్ లో ఓ సీన్లో భాగంగా సమంత నాటి ఎక్స్ప్రెషన్స్ ఇస్తుంది . ఈ నాటి ఎక్స్ప్రెషన్స్ గతంలో దుబాయ్ శీను సినిమాలో లేడీ గెటప్ వేసుకున్న విలన్ లా కనిపిస్తుంది. ఈ రెండు ఫొటోస్ ని మ్యాచ్ చేస్తూ సోషల్ మీడియాలో ఆమెను ఏకీపారిస్తున్నారు జనాలు . దీంతో సమంత ఇంత లైట్ గా మారిపోయిందా జనాలకి ..? ఒకప్పుడు అందాల దేవత టాలీవుడ్ ఇండస్ట్రీని ఏలేసే మహారాణి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి విడాకులు తీసుకున్న తర్వాత సమంత సోషల్ మీడియాలో ఎక్కువ ట్రోలింగ్ గి గురి అవుతున్నది అన్నది మాత్రం వాస్తవం..!!