ప్రభాస్-రష్మిక కాంబో లో మిస్ అయిన సినిమా ఏంటో తెలుసా..?

నేషనల్ క్రష్ గా పేరు సంపాదించుకున్న రష్మిక మందన్న.. తన కెరియర్ లో ఎన్నో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సినిమాలో నటించింది . కాగా ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ టైంలోనే సూపర్ స్టార్ గా క్రేజ్ సంపాదించుకొని నేషనల్ క్రష్ గా ట్యాగ్ చేయించుకుని మరి స్టార్ హీరోయిన్ లిస్టులోకి వెళ్ళి రాజ్యమేలేస్తున్న రష్మిక మందన ..ప్రజెంట్ టాలీవుడ్ – బాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్మోస్ట్ హీరోయిన్గా ఉంది .

 

కోలీవుడ్ లోను సినిమాలు చేసింది . అయితే ఈ మధ్యకాలంలో కోలీవుడ్లో అవకాశాలు తగ్గాయి. అయితే రష్మిక మందన్నా గతంలో తన వద్దకు వచ్చిన భారీ ఆఫర్ ను రిజెక్ట్ చేసిందట. ఆ విషయంలో ఇప్పటికి బాధపడుతుందట . అయితే ఆ హీరోతో ఒక్కసారైనా మళ్ళీ తిరిగి నటించే ఛాన్స్ వస్తే బాగుండు అంటూ ఆశపడుతుంది రష్మిక మందన్నా. ఇంతకీ ఆ క్రేజీ ఆఫర్ ఏంటో తెలుసా? రాధే శ్యామ్ ఆఫ్ కోర్స్.. ఈ సినిమా ఫ్లాప్ అయినా సరే ప్రభాస్ పక్కన నటిస్తే చాలు అనుకున్న హీరోయిన్స్ ఎంతోమంది ఉన్నారు .

బాహుబలి తర్వాత భారీ బడ్జెట్ లో నటించిన సినిమా రాధే శ్యామ్. రాధాకృష్ణ ఈ సినిమాని డైరెక్ట్ చేశారు. ఈ సినిమాలో హీరోయిన్గా పూజ హెగ్డే నటించింది . అయితే పూజా కన్నా ముందే ఈ సినిమాలో రష్మిక మందన్నా ను హీరోయిన్ గా అనుకున్నారట మేకర్స్. అయితే రష్మిక అప్పటికే వేరే సినిమాలో బిజీగా ఉండడంతో ఈ సినిమాను రిజెక్ట్ చేసిందట . దీంతో ఈ ఆఫర్స్ మెల్లగా పూజా ఖాతాలో పడిపోయింది . అయితే పూజా హెగ్డే ఈ సినిమా ఫ్లాప్ అయినా సరే తన నటన ద్వారా ఈ సినిమాలో మంచి మార్కులు వేయించుకుంది . కానీ ఏం లాభం ఇప్పుడు ఒక్క సినిమా చేతిలో లేకుండా అల్లాడిపోతుంది. అదే రష్మిక మందన్నా చేతిలో ఆరు ఏడు ప్రాజెక్టులు పెట్టుకొని దూసుకుపోతుంది..!!