ఈ మామ-అల్లుళ్లు మహా నాటీ “బ్రో”.. టీజర్ వచ్చేసిందోచ్(వీడియో)..!!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అంటూ ఆశగా ఈగర్ గా వెయిట్ చేసిన మూమెంట్ రానే వచ్చేసింది. కొద్దిసేపటి క్రితమే ఆయన ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటిస్తున్న బ్రో సినిమాకి సంబంధించిన టీజర్ ని రిలీజ్ చేశారు మేకర్స్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ కాంబోలో తెరకెక్కుతున్న మెగా మల్టీస్టారర్ చిత్రం ‘బ్రో’.

ఈ సినిమా తమిళ్ మూవీ ‘వినోదయ సిత్తం’కి ఇది రీమేక్ గా వస్తుంది అన్న సంగతి అందరికి తెలిసిందే. అక్కడ ఆ చిత్రాన్ని తెరకెక్కించిన సముద్రఖనినే తెలుగు వెర్షన్ కి కూడా దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా వచ్చే నెల జులై 28న ఆడియన్స్ ముందుకు తీసుకు రాబోతున్నారు మేకర్స్. దీంతో మూవీ టీం ప్రమోషన్స్ మొదలు పెట్టింది. ప్రమోషన్స్ లో భాగంగా కొద్దిసేపటి క్రితమే టీజర్ రిలీజ్ చేసింది.

ఈ టీజర్ అభిమానులను తెగ ఆకట్టుకుంటుంది. మరీ ముఖ్యంగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ అద్దిరిపోయింది. త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు రాసిన డైలాగ్ సినిమాకి హైలైట్ కాబోతున్నాయి అంటూ టీజర్ తోనే తెలుస్తుంది . “కాలం మీ గడియారానికి అందని ఇంద్రజాలం..” అంటూ పవన్ కళ్యాణ్ చెప్పే డైలాగ్ చాలా హైలెట్ గా నిలవబోతోంది . అంతేకాదు పవన్ – సాయి ధరంతేజ్ మధ్య వచ్చే సీన్స్ కూడా సినిమాని మరో మెట్టు ఎక్కించబోతున్నాయి.

లాస్ట్ లో పవన్ “నువ్వు సినిమాలు ఎక్కువ చూస్తావ్ ఏంట్రా”..డైలాగ్ సూపర్ గా ప్లస్ కానున్నాయి అంటూ తెలుస్తుంది . అంతేకాదు సాయి ధరంతేజ్ కూడా చాలా యాక్టివ్ గా స్టైలిష్ గా కనిపించాడు. ఓవరాల్ గా టీజర్ మొత్తాని చూసుకుంటే జూలై 28న సిల్వర్ స్క్రీన్ ని షేక్ చేయడానికి రెడీ అయ్యారు ఈ మామ అల్లుళ్ళు .