సరిగ్గా చనిపోయే ముందు మేనకోడలితో సౌందర్య చెప్పిన మాటలు ఇవే..

మహానటి సావిత్రిని మైమరిపించిన తెలుగు హీరోయిన్ ఎవరైనా ఉన్నారా అంటే అది సౌందర్యానే అని నిస్సందేహంగా చెప్పవచ్చు. ఈ ముద్దుగుమ్మ చాలా ట్రెడిషనల్ రోల్స్‌లో నటించి ప్రతి తెలుగువారి ఇంటి అమ్మాయిగా అందరి మనసుల్లో చోటు సంపాదించుకుంది. ఆమె బతికి ఉంటే ఎంత బాగుండో అని ఇప్పటికీ టాలీవుడ్ ప్రేక్షకులు అనుకుంటూనే ఉంటారు. అంతలా ఆమె అభిమానుల గుండెల్లో చెరగని ముద్ర వేసింది. ఆమె మరణానికి ముందు ఏం జరిగింది? ఎలా చనిపోయింది? ఆమె చివరి రోజులు ఎలా గడిచాయి? వంటి విషయాలు ఇప్పటికీ హాట్‌ టాపిక్ గానే నిలుస్తుంటాయి.

అయితే తాజాగా సౌందర్య తన చివరి రోజులలో ఏం మాట్లాడిందో అందరితో పంచుకోవడానికి ఆమె మేనకోడలు నిర్మల మీడియా ముందుకు వచ్చింది. చనిపోవడానికి ముందు సౌందర్య కొన్ని కోరికలు కోరిందని నిర్మల ఒక ఇంటర్వ్యూలో తెలిపింది. ఆమె మాట్లాడుతూ.. “చనిపోవడానికి ముందు మా మేనత్త సౌందర్య నాకు ఫోన్ చేసి కాటన్ శారీలు, కుంకుమ కావాలని అడిగింది. ఎలక్షన్ క్యాంపెయిన్‌లో కాటన్ చీర ధరిస్తే చాలా బాగుంటుందని ఆమె అనుకుంది. అందుకే ఒక కాటన్ శారీ కొనాలని నన్ను చాలా రిక్వెస్ట్ చేసింది. ఎందుకంటే అప్పటికి తన వద్ద ఎలాంటి కాటన్ శారీ లేదు. బిజీగా ఉండటం వల్ల ఈ పనిని నాకే అప్పచెప్పింది.” అని పేర్కొంది.

ఇక కుంకుమ నుదుటన పెట్టుకోవడానికి సౌందర్య దానిని తేవాలని మేనకోడలిని అడిగినట్లు తెలిసింది. ఏది ఏమైనా ఆమె చక్కగా చీర కట్టుకొని ఎన్నికల ప్రచారంలో పాల్గొనాలని అనుకుంది కానీ హెలికాప్టర్ ప్రమాదంలో చాలా చిన్న వయసులోనే అనంత లోకాలకు వెళ్లిపోయింది.