టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ పెళ్లి చూపులు సినిమాతో హీరోగా పరిచయమై అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. విజయ్ గత సంవత్సరం తొలిసారిగా పాన్ ఇండియా లెవెల్ లో నటించిన సినిమా లైగర్. టాలీవుడ్ డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఈ పాన్ ఇండియా సినిమా గత సంవత్సరం ప్రేక్షకుల ముందుకు వచ్చి ఘోరమైన డిజాస్టర్ గా మిగిలిపోయింది.
విజయ్ దేవరకొండ తన తొలి పాన్ ఇండియా సినిమాతోనే విడుదలకు ముందు భారీ స్థాయిలో హైప్ తెచ్చుకున్నాడు. ప్రధానంగా ఈ సినిమాను బాలీవుడ్ అగ్ర నిర్మాత కరణ్ జోహార్ స్వయంగా నిర్మించడం మరో విషయం. ఈ సినిమా విడుదలకు ముందు భారీ స్థాయిలో హైప్ తెచ్చుకుంది. సినిమా విడుదలయ్యాక చూస్తే మాత్రం ఊహించని విధంగా విజయ్కు ఘోరమైన అవమానంగా మిగిలింది. దీంతో ఈ సినిమా దర్శకుడు పూరి జగన్నాథ్ కుప్పకూలిపోయాడు.
ఈ సినిమా దెబ్బతో విజయ్ పాన్ ఇండియా సినిమాలు అంటేనే హడలెత్తిపోతున్నాడు. లైగర్ షూటింగ్ సమయంలోనే పూరీతో మరో పాన్ ఇండియా మూవీ జనగణమను మొదలు పెట్టాడు. అయితే లైగర్ మూవీ దెబ్బతో విజయ్ ఆ సినిమా నుంచి పక్కకు తప్పుకున్నాడు. అదే సమయంలో మరో బాలీవుడ్ అగ్ర నిర్మత ఆదిత్య చోప్రా నిర్మిస్తున్నా వార్2 సినిమాలో హృతిక్ రోషన్ తో కలిసి విజయ్ను ఈ సినిమాలో స్పెషల్ రోల్కి అనుకున్నట్టుగా తెలుస్తుంది.
కానీ పలు కారణాల చేత విజయ్ నుంచి అది తారక్ దగ్గరకి వచ్చింది అని రూమర్స్ వినిపిస్తున్నాయి. మరి ఇది ఎంతవరకు నిజమో కానీ ఎన్టీఆర్ పేరు వినిపించేసరికి మాత్రం ఈ సినిమాపై అంచనాలు ఒక్కసారిగా నెక్స్ట్ లెవెల్ కి వెళ్లాయని చెప్పాలి. ఇక ఇందులో ఎంతవరకు నిజముందో తెలియదు కానీ ఇప్పుడు ఇది సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.