“దొంగలు పడ్డ ఆరు నెలలకి కుక్కలు మొరగడం అంటే ఇదేగా”.. మెగాస్టార్ ని ఆడేసుకుంటున్న నెటిజన్స్..!!

టాలీవుడ్ నాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన రీసెంట్ సినిమా “దసరా”. శ్రీకాంత్ ఓదల డైరెక్షన్లో తెరకెక్కిన ఈ సినిమాలో హీరోయిన్గా మహానటి కీర్తిసురేష్ నటించింది. బాక్సాఫీస్ దగ్గర ఫస్ట్ షో తోనే ఈ సినిమా సూపర్ హిట్ టాక్ నమోదు చేసుకుంది. నాని కెరియర్ లోనే ఫస్ట్ టైం 100 కోట్ల క్లబ్లోకి రీచ్ అయ్యేలా చేసింది . ఇప్పటికే ఈ దసరా సినిమాపై టాలీవుడ్ స్టార్స్ ఎంతోమంది నాని ను ఓ రేంజ్ లో పొగిడేస్తున్నారు.

మరీ ముఖ్యంగా టాలీవుడ్ రెబల్ హీరో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ..మహేష్ బాబు.. ఈ సినిమాని ఏ రేంజ్ లో పొగిడేశారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . శ్యాం సింగరాయ సినిమా తర్వాత నానికి బిగ్గెస్ట్ పేరు తెచ్చి పెట్టింది ఇదే. ఫస్ట్ వీక్ లోనే బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకుని.. లాభాల బాట పట్టింది . కాగా ఇలాంటి సినిమాపై తాజాగా మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు . నాని దసరా సినిమాను ఓ రేంజ్ లో పొగిడేసారు.

నాని దసరా సినిమా చాలా బాగుందని ..గొప్పగా ఉందంటూ ట్వీట్ చేశారు . మెగాస్టార్ ట్విట్టర్లో రాసుకొస్తూ ..”దసరా సినిమా చూశాను.. చాలా చాలా అద్భుతంగా ఉంది ..నాని పర్ఫామెన్స్ చాలా నాచురల్ గా ఉంది ..అదరగొట్టేసాడనే చెప్పాలి . ఇక దర్శకుడు శ్రీకాంత్ గురించి ఎంత చెప్పినా తక్కువే .. ఫస్ట్ సినిమాకే ఇంతటి మెచ్యూరిటీ లెవెల్స్ ఆశ్చర్యంగా అనిపిస్తున్నాయి. అతని నైపుణ్యానికి కచ్చితంగా అప్రిషియేట్ చేయాల్సిందే. కీర్తి సురేష్ నటన సూపర్ ..జస్ట్ వావ్ అని చెప్పాలి. దీక్ష శెట్టి కూడా అద్భుతంగా నటించాడు” అంటూ రాసుకొచ్చాడు .

ఈ క్రమంలోనే మెగాస్టార్ చేసిన ట్వీట్ ను మెగా ఫాన్స్ ట్రెండ్ చేస్తుంటే ..మరికొందరు హీరో ఫ్యాన్స్ ట్రోల్ చేస్తున్నారు. సినిమా రిలీజ్ అయింది మార్చి 30 ..ఈరోజు డేట్ 13 సినిమా రిలీజ్ అయిన 14 రోజులకి నీకు ఈ సినిమా రివ్యూ ఇవ్వాలనిపించిందా..? ఇదే దొంగలు పడిన ఆరు నెలలకు కుక్కలు మొరగడం అంటే..? అంటూ వ్యంగ్యంగా ట్రోల్ చేస్తున్నారు . దీంతో మెగా ఫాన్స్ అలాంటి ట్రోలర్స్ కి ఘాటుగా తిప్పికొడుతూ కౌంటర్స్ ఇస్తున్నారు..!!