విలన్ పాత్రలో యంగ్ టైగర్… వద్దని వేడుకుంటున్న ఫ్యాన్స్?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి పరిచయం అక్కర్లేదు. ఇపుడు అతను ఏ సినిమా చేసినా అది పాన్ ఇండియా కాదు, గ్లోబల్ స్థాయిలో విడుదల అవుతుంది అనడంలో అతిశయోక్తి కాదు. మన జూనియర్ ఎన్టీఆర్30తో బిజీగా ఉన్నారు. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఆర్ఆర్ఆర్ తరువాత వస్తున్న సినిమా కావడంతో కొంచెం గట్టిగానే అంచనాలు పెట్టుకున్నారు అభిమానులు. ఇదిలా ఉంటే ఎన్టీఆర్ బాలీవుడ్‌లో కూడా ఎంట్రీ ఇస్తున్నట్లు అధికారికంగా వెల్లడైంది.

అవును, ఎన్టీఆర్ హృతిక్ రోషన్‌తో కలిసి వార్-2లో నటించనున్నారు. నవంబరు నుంచి తారక్ వార్-2 చిత్రీకరణలో భాగం కానున్నారని కూడా సమాచారం అందుతోంది. కాగా ఈ మూవీకి సంబంధించి మరో ఆసక్తికరమైన వార్త బయటకు వచ్చింది. అదేమంటే వార్-2లో ఎన్టీఆర్ సరసన ఫీమేల్ లీడ్‌గా ఆలియా భట్‌ను తీసుకోనున్నారట. ఇప్పటికే ఆర్ఆర్ఆర్ చిత్రంలో నటించిన ఆలియా, తారక్‌ రెండోసారి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు. బ్రహ్మాస్త్ర దర్శకుడు అయ్యన్ ముఖర్జీ ఈ మూవీని తెరకెక్కిస్తుండటంతో ఆమె ఈ ప్రాజెక్టుకు ఓకే చెప్పిందని ఇండస్ట్రీ వర్గాల సమాచారం.

అదంతా పక్కబెడితే ప్రస్తుతం అందుతున్న వార్తను విని ఎన్టీఆర్ అభిమానులు నొచ్చుకున్నట్టు తెలుస్తోంది. బీటౌన్ మీడియా వర్గాల ప్రకారం వార్-2లో హృతిక్ రోషన్ హీరోగా చేస్తుండగా.. తారక్ విలన్ పాత్రలో నటించనున్నారని గుసగుసలు వినబడుతున్నాయి. యావత్ పాన్ ఇండియా స్థాయిలో ఎన్టీఆర్ సత్తా చాటినవేళ ఇలా విలన్ పాత్రలో చేస్తే తమ హీరోకి బాగా డామేజ్ జరుగుతుందని నందమూరి అభిమానులు ఫీల్ అవుతున్నారు. అయితే విషయం ఇంకా పూర్తిగా తెలియక ముందే ఈ ఏడుపు దేనికి అని కొంతమంది తారక్ అభిమానులకు క్లాస్ పీకినట్టు సమాచారం. ఏదిఏమైనా ఈ విషయమై ఇంకా క్లారిటీ రావలసి వుంది.