వెండితెరపై తమకు ఇష్టమైన హీరోను చూస్తేనే అభిమానులు ఎగిరి గంతేస్తారు.. అదే ఆ హీరో రెండు క్యారెక్టర్ లో కనిపిస్తే అభిమానుల ఆనందానికి అవధులు ఉండవు. తెలుగులో డ్యూయల్ రోల్ సినిమాలకు ఇప్పుడు భారీ ఫాలోయింగ్ ఉంది.. స్టార్ హీరోలు డ్యూయల్ రోల్ సినిమాలు చేసినప్పుడల్లా వాటిని చూసేందుకు అభిమానులు చాలా ఎక్సైట్ అవుతారు. ఇక ఇప్పుడు డ్యూయల్ రోల్ సినిమాలపై మన టాలీవుడ్ హీరోలు మనసు పడేసుకున్నారు.
ఇక ఇప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోలు అందరూ వరుస పెట్టి డ్యూయల్ రోల్ లో అదరగొట్టేందుకు రెడీగా ఉన్నారు. ఆ సినిమాలన్నీ కూడా భారీ బడ్జెట్ సినిమాలే కావటం మరో విశేషం. రామ్ చరణ్, ప్రభాస్, ఎన్టీఆర్ తమ తర్వాత సినిమాల్లో డ్యూయల్ రోల్ కనిపించబోతున్నారు. ఆ సినిమాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం.
రామ్ చరణ్:
శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ రాబోయే చిత్రం RC 15 లో ద్విపాత్రాభినయంలో కనిపించనున్నాడు. చరణ్ తండ్రీ కొడుకుల పాత్రలో నటించే అవకాశం ఉంది. మొదట ఐఏఎస్ అధికారిగా కనిపించనున్నాడు. ఫ్లాష్ బ్యాక్ సన్నివేశాల్లో రాజకీయ పార్టీ కార్యకర్తగా కనిపించనున్నాడు. ఇక బుచ్చిబాబు సనతో చరణ్ తన సినిమాలో ఇద్దరు అన్నదమ్ములుగా ద్విపాత్రాభినయం చేస్తున్నాడని సమాచారం.
ప్రభాస్:
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చే సాలార్ సినిమాలోనూ ప్రభాస్ డ్యూయల్ రోల్లో కనిపించనున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన రెండు పోస్టర్లలో ఆయన డిఫరెంట్ లుక్స్లో కనిపించడంతో ఈ సినిమాలో డార్లింగ్ ప్రభాస్ ద్విపాత్రాభినయం చేస్తారని అనుకుంటున్నారు.
ఎన్టీఆర్:
కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ తన రాబోయే చిత్రం ఎన్టీఆర్ 30లో ద్విపాత్రాభినయంలో కనిపించనున్నట్లు సమాచారం. జాన్వీ కపూర్ ఇందులో కథానాయికగా నటిస్తోంది. గతంలో ఎన్టీఆర్ డ్యూయల్ రోల్లో మెప్పించాడు. అదుర్స్, ఆంధ్రావాలా సినిమాల్లో నటించిన విషయం తెలిసిందే.
సమంత:
బాలీవుడ్ కథనాల ప్రకారం భేదియా ఫేమ్ దర్శకుడు అమర్ కౌశిక్ వాంపైర్స్ ఆఫ్ విజయనగర్ అనే చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. ఇందులో ఆయుష్మాన్ ఖురానా, సమంత ప్రధాన పాత్రలు పోషించనున్నారు. ఈ సినిమాలో సమంత ద్విపాత్రాభినయం చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ వార్త నిజమైతే ఇది సమంత మొదటి ద్విపాత్రాభినయం అవుతుంది. ఇలా టాలీవుడ్ స్టార్ హీరోలు అందరూ వరుస పెట్టి డ్యూయల్ రోల్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. వాటిలో ఏ హీరో ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తారో చూడాలి.