త్రిబుల్ ఆర్ సినిమా లాంటి గ్లోబల్ హిట్ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇప్పటికీ తన తర్వాత సినిమా షూటింగ్ మొదలు పెట్టలేదు. తన 30వ సినిమాను తెలుగు స్టార్ దర్శకుడు కొరటాల శివతో చేయబోతున్నట్లు ప్రకటించాడు. అదేవిధంగా ఓ మోషన్ పోస్టర్ ని కూడా విడుదల చేశారు. ఈ సినిమా కోసం ఎన్టీఆర్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఇక ఎన్టీఆర్ ఏ ఫంక్షన్ కి వెళ్లిన ఎన్టీఆర్ 30వ సినిమా అప్డేట్ అంటూ అభిమానులు గోల చేస్తూనే ఉన్నారు. రీసెంట్గా ఓ ఈవెంట్లో పాల్గొన్న ఎన్టీఆర్ ఆ సినిమా అప్డేట్ను అభిమానులతో పంచుకున్నారు. ఇప్పుడు ఈ క్రమంలోనే అమెరికాలోని ఎన్టీఆర్ అభిమానులు వినూత్నంగా ఆయనకు థాంక్స్ చెప్పారు.
థాంక్యూ ఎన్టీఆర్..’NTR30 కోసం మేము వేచి ఉండలేకపోతున్నాం అనే బ్యానర్ను ఓ ఎయిర్ జెట్ ద్వారా గాల్లో ఎగరవేశారు’. కాగా ఈనెల 23న ఈ సినిమా పూజా కార్యక్రమంతో క్లాప్ కొట్టబోతున్నట్లు ఈ సినిమా యూనిట్ ఇప్పటికే ప్రకటించింది. కాగా ఈ సినిమాలో ఎన్టీఆర్ కు జంటగా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తుంది.
ఇటీవలే అధికారికంగా సినిమా యూనిట్ కూడా ప్రకటించింది. అంతేకాకుండా ఈ సినిమాలో మరో బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటించబోతున్నాడని కూడా తెలుస్తుంది. మరి ఈ సినిమాతో ఎన్టీఆర్ ఎలాంటి ? రికార్డులు క్రియేట్ చేస్తారో చూడాలి.