మెగా డాటర్ నిహారిక, ఆమె భర్త జొన్నలగడ్డ చైతన్య విడిపోయారంటూ జోరుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. 2020లో వీరిద్దరూ పెద్దల సమక్షంలో అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్నారు. కానీ, పెళ్లై మూడేళ్లు గడవక ముందే నిహారిక, చైతన్య వైవాహిక జీవితలో మనస్పర్థలు తలెత్తాయి. దాంతో గత కొద్ది రోజుల నుంచి విడి విడిగా ఉంటున్న ఈ జంట.. విడాకుల బాట పట్టారని వార్తలు వస్తున్నాయి.
ఇదే సమయంలో ఇన్స్టాగ్రామ్ లో ఒకరినొకరు అన్ ఫాలో చేసుకోవడం, చైతన్య తన ఇన్స్టా అకౌంట్ నుంచి తమ పెళ్లి ఫోటోలు మరియు నిహారికతో కలిసి దిగిన ఫోటోలన్నీ తొలగించడం వంటి అంశాలు నెట్టింట జరుగుతున్న ప్రచారానికి మరింత బలాన్ని చేకూర్చాయి. అయితే తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ తెరపైకి వచ్చింది. నిహారిక-చైతన్య విషయంలో చిరంజీవి సంచలన నిర్ణయం తీసుకున్నారట.
తమ్ముడి కూతురు జీవితాన్ని సరిదిద్దాలని డిసైడ్ అయ్యారట. అసలే నాగబాబుకు కూతురు అంటే అమితమైన ప్రేమ. దానికి తోడు ఆవేశం ఎక్కువ. ఆ ఆవేశంతో అల్లుడిపై నోరు జారితే ఎంత పెద్ద రచ్చ అవుతుందని చిరంజీవి భావించారట. అందుకే నాగబాబును సైలెంట్గా ఉండమని చెప్పారట. అంతేకాదు, చైతన్య మరియు అతని కుటుంబ సభ్యులతో తానే స్వయంగా మాట్లాడి వివాదానికి పులిస్టాప్ పెడతానని తమ్ముడికి హామీ ఇచ్చారట. చైతన్య తండ్రి ప్రభాకర్ రావు చిరంజీవికి అత్యంత సన్నిహితుడు. ఈ నేపథ్యంలోనే గొడవ పెద్దది కాకుండా విడాకులకు దారి తీయడకుండా చిరు ప్రయత్నాలు మొదలు పెట్టారని టాక్.