ప్రస్తుతం మన టాలీవుడ్ లో సహా సౌత్ సినిమా పరిశ్రమ దగ్గర రీ రిలీజ్ సినిమాల ట్రెండ్ నడుస్తుంది. ఇప్పటికే మన టాలీవుడ్ లో స్టార్ హీరోల అభిమానులు తమ అభిమాన హీరోల సూపర్ హిట్ సినిమాలను రీ మాస్టర్ చేసిన వెర్షన్ లను మళ్లీ రిలీజ్ చేస్తూ వాటికి భారీ ఎత్తున కలెక్షన్లు అందిస్తున్నారు. ఇప్పటికే ఈ రీ రిలీజ్ సినిమాలలో పవన్ కళ్యాణ్, మహేష్ బాబు ముందు వరుసలో ఉన్నారు.
ఇద్దరు హీరోల సినిమాలు ఇప్పటికే రీ రిలీజ్ అయి భారీ కలెక్షన్లు అందుకున్నాయి. ఇక ఎప్పుడూ ఈ హీరోలతో పాటు యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అయినటు వంటి సినిమా సింహాద్రి ని రీరిలీజ్ చేయడానికి సన్న హాలు చేస్తున్నారట. ఈ సినిమాని కూడా 4k వెర్షన్ లో అప్డేట్ చేస్తున్న ప్రింట్ను సిద్ధం చేస్తున్నారట.
ఈ సినిమాను దర్శక ధీరుడు రాజమౌళి సాలిడ్ యాక్షన్ అండ్ ఇంటెన్స్ ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కించాడు. ఇప్పుడు ఈ సినిమా రీ రిలీజ్ అయితే ఎవరు ఊహించని రికార్డులను క్రియేట్ చేస్తుందని చెప్పవచ్చు. ఈ సినిమాని ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా మే 20 న రీ రిలీజ్ కు సన్నాహాలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక మరి ఎన్టీఆర్కు ఉన్న మాస్ ఫాలోయింగ్ కి ఈ సినిమాతో ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తారో తెలియాల్సి ఉంది.