లేటు వ‌య‌సులో దిల్ రాజు ఘాటు ప్రేమ క‌థ‌.. రెండో పెళ్లి వెన‌క ఇంత క‌థ ఉందా?

టాలీవుడ్‌లో మోస్ట్‌ సక్సెస్‌ ఫుల్ ప్రొడ్యూసర్‌గా పేరు సంపాదించుకున్న‌ దిల్ రాజు 2020 క‌రోనా లాక్‌డౌన్ స‌మ‌యంలో తేజ‌స్విని అనే అమ్మాయిని రెండో వివాహం చేసుకున్న సంగ‌తి తెలిసిందే. అప్ప‌ట్లో వీరి పెళ్లి హాట్ టాపిక్ గా మారింది. దిల్‌ రాజు మొదటి భార్య అనిత గుండెపోటుతో 2017లో మరణించింది. అయితే మూడేళ్లపాటు ఒంటరి జీవితాన్ని గడిపిన దిల్‌ రాజు.. యాబైకి చేర‌వ‌వుతున్న స‌మ‌యంలో తేజ‌స్విని పెళ్లి చేసుకున్నాడు.

గ‌త ఏడాది ఈ దంప‌తుల‌కు ఓ మ‌గ‌బిడ్డ కూడా జ‌న్మించాడు. అయితే దిల్ రాజు, తేజ‌స్వినిల‌ది అరేంజ్డ్ మ్యారేజ్ అని అంతా అనుకున్నారు. కానీ, త‌మ‌ది ల‌వ్ మ్యారేజ్ అంటూ దిల్ రాజు తాజాగా షాక్ ఇచ్చాడు. దిల్ రాజు, తేజ‌స్విని పెళ్లి వెన‌క పెద్ద క‌థ ఉంది. ఓ ఇంట‌ర్వ్యూలో దిల్ రాజు మాట్లాడుతూ.. `నా భార్య అనిత చనిపోయిన తర్వాత రెండేళ్లు చాలా స్ట్ర‌గుల్ అయ్యాను. అప్పటికే నాకు 47 ఏళ్లు. జీవితంలో మళ్లీ ముందుకు వెళ్లాలనుకున్నాను.

అప్పుడే విమానంలో జర్నీ చేసే టైంలో తేజస్విని పరిచయమైంది. నాకు నచ్చడంతో ఫోన్ నంబర్ తీసుకుని దాదాపు ఏడాదిపాటు ఆమెని అర్థం చేసుకునే ప్రయత్నం చేశాను. ఆ తర్వాత ప్రపోజ్ చేశాను. ఆమెకు నచ్చడంతో ఫ్యామిలీతో చ‌ర్చ‌లు, చివరకు పెళ్లి వరకు వెళ్లింది. తేజస్వినిలో నాకు బాగా నచ్చిన విషయం ఆమె చాలా గ్రౌండ్ టూ ఎర్త్ ఉంటుంది` అంటూ చెప్పుకొచ్చారు. మొత్తానికి లేటు వ‌య‌సులో దిల్ రాజు ఘాటు ప్రేమ క‌థ విని నెటిజ‌న్లు ఆశ్చ‌ర్య‌పోతున్నారు. దిల్ రాజు ల‌వ్ స్టోరీ సినిమాను త‌ల‌పిస్తుందంటూ కామెంట్లు చేస్తున్నారు.