బ్లాస్టింగ్ అప్డేట్ ఇచ్చిన బాలయ్య… ఫ్యీజులు ఎగిరిపోయాయ్ అంతే..!

తెలుగు చిత్ర పరిశ్రమలో నాలుగు దశాబ్దాలగా అగ్ర హీరోలగా కొనసాగుతున్న చిరంజీవి, బాలకృష్ణ తమ సినిమాలతో తమకంటూ ఓ సపరేట్ ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకోగలిగారు. వీరిద్దరి సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయంటే అది ఒక మినీ బాక్సాఫీస్ యుద్ధంలా ఉంటుంది. ఇద్దరు ఇప్పటివరకు బాక్సాఫీస్ వద్ద 15 సార్లకు పైగా పోటీపడ్డారు. పోటీ పడిన ప్రతిసారి ఇద్దరి హీరోల అభిమానుల మధ్య యుద్ధ వాతావరణమే నెలకుంది. ఈ క్రమంలోనే ఈ ఇద్దరి అగ్ర హీరోలు మళ్ళీ రాబోయే సంక్రాంతికి ప్రేక్షకులు ముందుకు రాబోతున్నారు.

ఈ విషయాలన్నీ పక్కన పెడితే ఇద్దరి అగ్ర‌ హీరోలను ఒకే వేదికపై చూడాలని సినీ అభిమానులు ఎంతో ఆశగా కోరుకుంటున్నారు. మాస్ కి డిమీ గాడ్స్ లా చెప్పుకునే ఇద్దరు హీరోలు కలుసుకోవడం కూడా చాలా అరుదు. అయితే ప్రస్తుతం బాలకృష్ణ ఆహా ఓటిటి వేదికగా ఆన్ స్టాపబుల్ షో చేస్తున్న విషయం తెలిసిందే. ఈ షోలో ఇద్దరు హీరోలు ఒకే వేదికపై వస్తారని గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో కొన్ని వార్తలు హల్చల్ చేస్తున్నాయి.

ఈ వార్తలన్నీ పక్కన పెడితే ఇప్పుడు.. ‘నేను చిరంజీవి కలిసి నటిస్తే అది పాన్ వరల్డ్ సినిమా అవుతుంది’.. అంటూ బాలకృష్ణ మెగా నందమూరి అభిమానులలో సెన్సేషన్ క్రియేట్ చేశాడు. ప్రస్తుతం బాలకృష్ణ అన్ స్టాపబుల్ సీజన్ 2 కు సంబంధించిన ఐదో ఎపిసోడ్ ప్రోమో తాజాగా రిలీజ్ చేశారు. ఆ ప్రోమోలో రాబోయే ఎపిసోడ్ కు టాలీవుడ్‌కు సంబంధించిన న‌లుగురు లెజెండ్రీ పర్సన్స్ ముఖ్య అతిథులుగా వచ్చారు.

అల్లు అరవింద్, సురేష్ బాబు, రాఘవేంద్రరావు, కోదండరామిరెడ్డి. ఈ నలుగురితో బాలయ్య అదిరిపోయే రేంజ్ లో ఇరగదీశాడు. మధ్యలో బాలయ్య అల్లు అరవింద్ ని నువ్వు నాతో సినిమా ఎప్పుడు తీస్తావు అని అడగగా… నేను దానికోసమే ఎదురు చూస్తున్నాను మిమ్మల్ని చిరంజీవిని పెట్టి భారీ మల్టీస్టారర్ తీయాలని ప్లాన్ చేస్తున్నానని అల్లు అరవింద్ అనగా.. అప్పుడు బాలయ్య మొహంలో కొంత చిరునవ్వు కనిపించింది.

Balakrishna and Chiranjeevi: When rivals turn into 'close friends'

ఒక క్షణం ఆగి.. నేను చిరు కలిసి సినిమా తీస్తే ‘అది పాన్ వరల్డ్ సినిమా అవుతుంది’.. అంటూ ఆ ప్రోమోలో చూపించాడు. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బాలకృష్ణ అన్న మాటతో అభిమానులు ఈ ఇద్దరు సీనియర్ హీరోల మల్టీ స్టార్ సినిమా వస్తే బాగుంటుందంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్లు పెడుతూ తమ ఆనందాన్ని పంచుకుంటున్నారు.