అన్ స్టాపబుల్ 2: తన షోకు ఎన్టీఆర్ ను వద్దన్నా బాలయ్య..అస‌లేమైంది?

నట‌సింహం నందమూరి బాలకృష్ణ తొలిసారి హోస్ట్ గా చేసిన షో `అన్ స్టాపబుల్ విత్ ఎన్‌బీకె`. ప్రముఖ తెలుగు ఓటీటీ సమస్థ `ఆహా` వేదికగా ప్రసారమైన ఈ షో ఎంతటి విజయం సాధించిందో ప్రత్యేకంగా వివరించి చెప్పక్కర్లేదు. ఇండియాలోనే నెంబర్ 1 టాక్ షో గా కూడా రికార్డు క్రియేట్ చేసింది. అలాగే బాలయ్య ఈ షో ద్వారా తనలోని మరో కోణాన్ని ప్రేక్షకులకు రుచి చూపించాడు.

తనదైన మాటలతో, పంచ్ లతో వచ్చిన గెస్ట్ లోను తికమక పెడుతూ వారి దగ్గర నుంచి త‌న‌కు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా రాబట్టి ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందించారు. బాలయ్య హోస్ట్ గా చేస్తున్నాడా..? అని మొదట విమర్శించిన వారే ఆ తర్వాత ఆయనపై పొగడ్తల వర్షం కురిపించారు. ఇకపోతే ఇప్పుడు ఈ షోకు సీజన్ 2 స్టార్ట్ కాబోతున్న సంగతి తెలిసిందే. అక్టోబర్ 4 సాయంత్రం ఈ షో టీజర్ ను కూడా బయటకు వదిలారు. ఈ టీజ‌ర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.

త్వరలోనే ఈ షో ఫస్ట్ ఎపిసోడ్ ను ప్రసారం చేసేందుకు ఆహా టీం సన్నాహాలు చేస్తుంది. ఇదిలా ఉంటే ఈ షోకు యంగ్ టైగర్ ఎన్టీఆర్ గెస్ట్ గా రాబోతున్నాడని గత కొద్ది రోజుల నుంచి ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. బాబాయ్ అబ్బాయి మధ్య‌ కొన్నాళ్లుగా విభేదాలు ఉన్నాయి అంటూ వస్తున్న పుకార్లకు చెక్ పెట్టాలన్న ఉద్దేశంతోనే ఎన్టీఆర్ బాబాయ్ బాలయ్య షోలో పాల్గొనేందుకు రెడీ అవుతున్నాడని వార్తలు వచ్చాయి. ఈ వార్తలపై నందమూరి అభిమానులు ఎంతగానో సంబరపడ్డారు.

కానీ రీసెంట్‌ను ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ విషయంలో ఎన్టీఆర్ స్పందించిన తీరు పట్ల సొంత ఫ్యామిలీ మెంబర్స్ తీవ్ర వ్యతిరేకంగా ఉన్నార‌ట‌. ఈ నేపథ్యంలోనే బాలయ్య తన షోకు ఎన్టీఆర్ గెస్ట్ గా వద్దని నిర్వాహకులతో చెప్పినట్లు తాజాగా ఓ న్యూస్ తెరపైకి వచ్చింది. మరి ఇది ఎంతవరకు వాస్తవం..? బాలయ్య నిజంగానే ఎన్టీఆర్ ను తన షోకి వద్దన్నాడా..? అన్న విషయంపై క్లారిటీ రావాలంటే మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.