తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. అక్కినేని నాగ చైతన్యను ప్రేమించి వివాహం చేసుకున్న సమంత నాలుగు సంవత్సరాల తర్వాత వీరి వైవాహిక జీవితం నుండి మనస్పర్ధలు కారణంగా విడాకులు తీసుకొని ఎవరి దారిన వారు చూసుకున్నారు. నాలుగు సంవత్సరాల పాటు తమ వైవాహిక జీవితాన్ని బాగా ఎంజాయ్ చేసిన సమంత – నాగచైతన్య కారణమేంటో చెప్పకుండానే విడిపోయారు. అయితే సమంత విడాకులు తీసుకున్నప్పుడు ఆమె పైన ఒక రూమర్ వచ్చింది.. అదేమిటంటే ఆమె ఒక హీరోతో ఎఫైర్ పెట్టుకుందని వార్తలు వినిపించాయి. అందుచేతనే సమంత – నాగచైతన్య విడాకులు తీసుకున్నారని వార్తలు బాగా వైరల్ గా మారాయి.
ఇదిలా పక్కన పెడితే ఇప్పుడు మళ్లీ తాజాగా మరొక విషయం వైరల్ గా మారుతోంది. అదేమిటంటే ఈమె తాజాగా మరొక హీరో పైన మోజు పడుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వార్తలు వైరల్ గా మారినప్పటి నుంచి అక్కినేని అభిమానులు ఈమె పైన చాలా కోపంగా ఉన్నట్లు సమాచారం. ఇక సమంతకు అక్కినేని ఇంటి బిడ్డ ఉసురు తగిలిందని అందుచేతనే సమంత విడాకులు తీసుకొని ఇలా ఇబ్బంది పడుతుందని వార్త చాలా వైరల్ గా మారుతోంది. ఇక అసలు విషయంలోకి వెళితే అక్కినేని మనవరాలు సుప్రియ అంటే అందరికీ తెలిసిన విషయమే.ఇక ఈమె గతంలో ఒక వ్యక్తిని ప్రేమించి వివాహం చేసుకుంది. కానీ ఇప్పుడు అతనికి కూడా దూరంగా ఉంటూ ఒంటరిగానే ఉంది. అలా మళ్లీ ఇండస్ట్రీలోకి రీఎంట్రీ ఇచ్చింది సుప్రియ. అడవి శేషు హీరోగా వచ్చిన గూడచారి సినిమాతో తన సెకండ్ ఇన్నింగ్స్ ని మొదలుపెట్టింది. దీంతో అడవి శేషు , సుప్రియ మధ్య ఒక కొత్త లవ్ స్టోరీ మొదలైనట్లుగా వార్తలు వినిపించాయి. ఇక వీరిద్దరూ వివాహానికి కూడా అక్కినేని కుటుంబం ఒప్పుకున్నట్లుగా అప్పట్లో ఒక రూమర్ బాగా వైరల్ గా మారింది. అయితే వీరిద్దరిని పరోక్షంగా ఆపింది సమంత అని వార్తలు ఇప్పుడు చాలా వైరల్ గా మారుతున్నాయి. ఎందుచేత అంటే మొదటి నుంచి సుప్రియ అంటే సమంతకు పడదట. ఈ కారణం వల్లే వీరిద్దరి పెళ్లికి అడ్డు చెప్పినట్లుగా సమాచారం. అందుచేతనే సుప్రియ ఉసురు సమంతాకు తగిలి ఇలా వైవాహిక జీవితానికి దూరంగా ఉంటూ ఒంటరిగా ఉన్నట్లుగా సమాచారం.