ఆ ఎఫైర్ తో మళ్లీ వార్తల్లో నిలిచిన కీర్తి సురేష్..!!

తెలుగు ఇండస్ట్రీలో ప్రస్తుతం స్టార్ హీరోయిన్ లలో ఒకరిగా కొనసాగుతోంది హీరోయిన్ కీర్తి సురేష్. ఇక రామ్ పోతినేని హీరోగా వచ్చిన నేను శైలజ చిత్రం ద్వారా మొదటిసారిగా తెలుగు ఇండస్ట్రీ లోకి ఎంటర్ అయ్యింది ఈ ముద్దు గుమ్మ. తను నటించిన మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకుంది. ఇక తర్వాత రెమో, మహానటి తదితర సినిమాలలో నటించి స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించింది. తెలుగులో సీనియర్ హీరోయిన్ అయిన మేనక కూతురే కీర్తి సురేష్. అయితే ఇప్పుడు తాజాగా కీర్తి సురేష్ మరొకసారి ఎఫైర్ కారణంగా వార్తల్లో నిలుస్తోంది. ఇక వాటి గురించి తెలుసుకుందాం.

Keerthy Suresh and Anirudh Ravichander to tie the knot this year? - Movies  News

కీర్తి సురేష్ ని ఎప్పుడూ ఆమె పేరుతో కంటే ఎక్కువగా మహానటి అనే పేరుతో పిలుస్తూ ఉంటారు.ఇక గతంలో ఈ ముద్దుగుమ్మ గ్లామర్ షో చేయడానికి పెద్దగా ఇంట్రెస్ట్ చూపించేది కాదు. కానీ మహేష్ బాబుతో కలిసి నటించిన సర్కారు వారి పాట చిత్రంలో తన అందాల విషయంలో హద్దులను చెరిపేసింది. అయితే ఈ ముద్దుగుమ్మ కి వరుసగా అవకాశాలు రాలేకపోవడంతో కాస్త స్కిన్ షో చేయడం కూడా మొదలుపెట్టింది. ఇక అందుకు తగ్గట్టుగా అప్పుడప్పుడు సోషల్ మీడియాలో తన ఫోటోలను కూడా షేర్ చేస్తూ కుర్రకారుల మతి పోగొడుతుంది.

Suresh Kumar is furious over Keerthy issue - MixIndia

అయితే గతంలో కోలీవుడ్ స్టార్ సింగర్ అయినా అనిరుధ్ తో ఈమె ఎఫైర్ నడుపుతోంది అన్నట్లుగా వార్తలు వినిపించాయి. అనిరుద్ తో కలిసి కీర్తి సురేష్ చాలా క్లోజ్ గా ఉన్నటువంటి కొన్ని ఫోటోలు కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారుతున్నాయి. దాంతో వీరిద్దరి మధ్య ఏదో ఉందని వార్తలు కూడా మరొకసారి గుప్పుమంటున్నాయి. అంతేకాకుండా వీరు వివాహం చేసుకోబోతున్నారు అనే వార్తలు అప్పట్లో చాలా వైరల్ గా మారాయి. దీంతో ఈ విషయంపై కీర్తి సురేష్ కొట్టి పారేసినా.. కోలీవుడ్లో మాత్రం ఇప్పటికి ఈ విషయం హాట్ టాపిక్ గా మారుతోంది. ప్రస్తుతం నానితో కలిసి దసరా సినిమాలో నటిస్తోంది కీర్తి సురేష్.