నందమూరి బాలకృష్ణ తొలిసారి హోస్ట్గా చేస్తున్న షో `ఆన్ స్టాపబుల్`. ప్రముఖ తెలుగు ఓటీటీ సంస్థ `ఆహా`లో ఈ టాక్తో మొత్తం 12 ఎపిసోడ్లుగా స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ షోలో ఫస్ట్ ఎపిసోడ్కి టాలీవుడ్ కలెక్షన్ కింగ్ మోహన్ బాబు, ఆయన కూతురు మంచు లక్ష్మి, తనయుడు మంచు విష్ణు గెస్ట్లుగా విచ్చేశారు.
ఇందుకు సంబంధించిన ప్రోమోను కొన్ని గంటల క్రితమే ఆహా టీమ్ విడుదల చేయగా.. ఇప్పుడా ప్రోమో యూట్యూబ్లో దుమ్ములేపేస్తూ దూసుకుపోతోంది. `నేను మీకు తెలుసు.. నా స్థానం మీ మనసు `అంటూ బాలయ్య చెప్పే డైలాగ్ తో స్టార్ అయిన ఈ ప్రోమో మస్తు ఫన్నీగా, సూపర్ స్పైసీగా ఆకట్టుకుంటోంది.
ఇక ఇప్పుడు ఈ ప్రోమోతోనే బాలయ్య నయా రికార్డు క్రియేట్ చేశారు. ఇంతకీ మ్యాటర్ ఏంటంటే.. ఆన్ స్టాపబుల్ ఫస్ట్ ఎపిసోడ్ ప్రోమో విడుదలైన రెండు గంటల్లోనే 1 మిలియన్ వ్యూస్ను దక్కించుకుంది. దాంతో అతి తక్కువ సమయంలోనే అత్యధిక వ్యూస్ సాధించిన ప్రోమోగా రికార్డు సృష్టించింది. కాగా, ఈ ప్రోమోకు సంబంధించిన ఫుల్ ఎపిసోడ్ దిపావళి కానుకగా నవంబర్ 4న ఆహాలో ప్రసారం కానుంది.