తాము గెలవలేమని తెలిసినా.. పోటీ ప్రధానంగా టీడీపీ,వైసీపీ మధ్య అని రాజకీయ వర్గాలన్నీ కోడై కూస్తున్నా ఇవేమీ పట్టించుకోకుండా నంద్యాల ఉప ఎన్నిక బరిలో కాంగ్రెస్ తమ అభ్యర్థిని నిలబెట్టి అందరినీ ఆశ్చర్యపరిచింది. అంతే గాక మైనారిటీ వర్గానికి చెందిన అబ్దుల్ ఖాదిర్ను తమ అభ్యర్థిని ప్రకటించింది. ఏ నమ్మకం మీద ఉప ఎన్నిక బరిలోకి దిగింది? మైనారిటీ అభ్యర్థినే బరిలోకి దించడం వెనుక రాజకీయంగా ఎవరికి లాభం? ఎవరికి నష్టం? అనే చర్చ ఇప్పుడు మొదలైంది. […]
Tag: YS Jagan
ఒక్క రాజీనామాతో ఆత్మరక్షణలో టీడీపీ
నంద్యాల ఉప ఎన్నిక బరిలో వైసీపీ అభ్యర్థి శిల్పా మోహనరెడ్డి తమ్ముడు శిల్పా చక్రపాణి రెడ్డి.. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడం ఇప్పుడు రాజకీయంగా చర్చనీయాంశమైంది. టీడీపీ ద్వారా ఎమ్మెల్సీగా ఎన్నికైన ఆయన.. వైసీపీలో చేరిన 24 గంటల్లోనే స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా చేశారు, ఇక్కడే వైసీపీ అధినేత జగన్ సూపర్ సక్సెస్ అయ్యారనే వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా వైసీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేయకుండానే టీడీపీలో చేరిపోవడం.. ఇంకా కొనసాగుతున్న తరుణంలో సీఎం చంద్రబాబు చేసిన జగన్ […]
20 రోజులు జగన్ ఫ్యామిలీ అడ్రస్ చేంజ్
కర్నూలు జిల్లా నంద్యాలలో వైసీపీ క్రమక్రమంగా పట్టు బిగిస్తోంది. గత వారం రోజులుగా ఇక్కడ ఎవరో ఒకరు ప్రముక వ్యక్తి వైసీపీలో చేరుతూనే ఉంటున్నారు. మాజీ ఎమ్మెల్యే సంజీవరెడ్డి, నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్చార్జ్ రాకేశ్రెడ్డి, టీడీపీ కార్పొరేటర్ హనీఫ్, నిన్న తాజాగా టీడీపీ ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణిరెడ్డి వైసీపీలోకి జంప్ చేసేస్తున్నారు. ఇక్కడ ఎన్నిక 2019 సాధారణ ఎన్నికలకు సెమీఫైనల్గా అందరూ భావిస్తుండడంతో జగన్ కూడా ఇక్కడ చావో రేవో తేల్చుకునేందుకు రెడీగానే ఉన్నాడు. ఈ క్రమంలోనే […]
2019 క్లారిటీ: ఎన్టీఆర్+పవన్+లోకేశ్ ఒకవైపు జగన్ ఒక వైపు
2019 ఎన్నికలు రెండు తెలుగు రాష్ట్రాల్లోను హీటెక్కిస్తున్నాయి. ఈ హీట్ తెలంగాణలో కంటే ఏపీలోనే ఎక్కువుగా ఉంది. ఏపీలో వచ్చే ఎన్నికల నాటికి ప్రస్తుతం ఉన్న పరిస్థితులు మారడం ఖాయంగా కనిపిస్తోంది. నేడు మిత్రపక్షాలుగా ఉన్నవాళ్లు ఎన్నికల వేళ శత్రువులు అవుతారన్న ఊహాగానాలు కూడా మొదలయ్యాయి. ఇదిలా ఉంటే ఏపీలో బీజేపీ+టీడీపీ పొత్తు బ్రేకప్ అవుతుందన్న వార్తల నేపథ్యంలో బుధవారం ఏపీ సీఎం చంద్రబాబు తనయుడు, మంత్రి నారా లోకేశ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి. […]
బీజేపీతో వైసీపీ పొత్తు…. సీట్ల డీల్ ఇదే..!
ఏపీలో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారిపోతున్నాయి. నిన్నటి వరకు మిత్రపక్షాలుగా ఉన్న అధికార టీడీపీ+బీజేపీ వచ్చే ఎన్నికల నాటికి కలిసుండే ఛాన్సులు లేవని ప్రచారం జరుగుతోంది. కొద్ది రోజులుగా జరుగుతోన్న పరిణామాలు కూడా అందుకు ఊతం ఇచ్చేలా ఉన్నాయి. చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు అయిన మాజీ కేంద్ర మంత్రి ఉపరాష్ట్రపతిగా వెళ్లిపోతుండడం, ఇక ఇప్పుడు ఏపీ బీజేపీ అంతా చంద్రబాబును టార్గెట్ చేసే వాళ్ల చేతుల్లోకి వెళ్లిపోవడంతో ఏపీలో బీజేపీ టీడీపీ మధ్య ఫ్యూచర్లో వార్ ఓ […]
నంద్యాలలో వైసీపీ షాడో టీంలు!
భూమా నాగిరెడ్డి మరణంలో ఖాళీ అయిన నంద్యాల ఎమ్మెల్యే స్థానానికి వచ్చే నెలలో ఉప ఎన్నిక జరగనుంది. దీనికి సంబంధించి ఎన్నికల సంఘం నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. అయితే, ఈ స్థానం నుంచి గెలిచి తీరాలని ఏపీ అధికార పక్షం టీడీపీ, విపక్షం వైసీపీలు గట్టి పంతం పట్టాయి. ఈ సీటు తమదేనని వైసీపీ, లేదు తమ అభ్యర్థిగా ఉన్న భూమా మరణించాడు కాబట్టి ఇది తమదేనని టీడీపీలు వాదిస్తున్నాయి. ఇక, అధికార పక్షం ఎన్నికల […]
నలుగురు వైసీపీ ఎంపీ అభ్యర్థులు ఖరారు!
సంచలన నిర్ణయాలకు పెట్టి పేరైన దివంగత వైఎస్ కుమారుడు, వైసీపీ అధినేత జగన్ 2019 ఎన్నికలకు సంబంధించి.. మరింత సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయంలో ఉండగానే ఆయన ప్రజలపై నవ రత్నాల పేరుతో వరాల జల్లు కురిపిస్తూ.. ప్రత్యర్థులకు ముచ్చెమటలు పట్టిస్తున్నారు. అదేసమయంలో ఎంపీ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయడం ఇప్పుడు మరింత సంచలనంగా మారింది. వైసీపీ తరఫున 2019లో పార్లమెంటుకు పోటీ చేసే అభ్యర్థులపై జగన్ ఇప్పటికే కసరత్తు ప్రారంభించేశారు. ఈ […]
నంద్యాల వార్ భూమా, శిల్పాది కాదు బాబు-జగన్ మధ్యే
భూమా నాగిరెడ్డి ఆకస్మిక మరణంతో ఖాళీ అయిన నంద్యాల ఎమ్మెల్యే సీటుకు ఉప ఎన్నిక త్వరలోనే జరగనుంది. దీనికి సంబంధించి ఎన్నికల సంఘం నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. అయితే, ఈ ఉప ఎన్నికపై అంచనాలు రోజు రోజుకు మారిపోతున్నాయి. వాస్తవానికి ఈ ఉప ఎన్నిక పార్టీ ల మధ్య కాకుండా పార్టీ అధినేత ల మధ్య ఫైట్గా మారిపోయింది. సుదీర్ఘ అనుభవం ఉన్న రాజకీయ నేతగా బాబుకు, యువనేతగా జగన్కు మధ్య సాగుతున్న పోరుగా నంద్యాల […]
జగన్ చెంతకు ముద్రగడ…ఎంపీగా పోటి అక్కడ నుండే
కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం పొలిటికల్ ఎంట్రీకి ముహూర్తం ఫిక్సయిపోయిందా? ఆయన ప్రధాన విపక్షం జగన్ పార్టీ వైసీపీలోకి ఎంట్రీ ఇస్తున్నారా? అంటే ఔననే అంటున్నారు తూర్పుగోదావరి జిల్లా రాజకీయ నేతలు. విషయంలోకి వెళ్తే.. గడిచిన రెండేళ్లుగా ముద్రగడ ఏపీ రాజకీయాల్లో ప్రధానంగా కనిపిస్తూనే ఉన్నారు. ముఖ్యంగా కాపు లకు రిజర్వేషన్ ఇవ్వడంలో చంద్రబాబు తాత్సారం చేస్తున్నారని ఆయన పదే పదే విమర్శించడమే కాకుండా కాపులకు రిజర్వేషన్ సాధించేందుకు ఆయన అలుపెరుగని కృషి చేస్తున్నారు. తన […]
