మరోసారి ముందస్తు మాట… ఈ టూర్ అందుకేనా….!?

ముందస్తు ఎన్నికలు అనే మాట ఇప్పట్లో వెనక్కి తగ్గేలా లేదు. వాస్తవానికి సార్వత్రిక ఎన్నికలకు ఇంకా 8 నెలలు సమయం ఉంది. వచ్చే ఏడాది మే నెల వరకు కేంద్రంలో మోదీ సర్కార్‌కు, ఏపీలో జగన్ ప్రభుత్వానికి గడువుంది. కానీ ఏడాది ముందు నుంచే ముందస్తు మాట బలంగా వినిపిస్తోంది. ఈ ఏడాది నవంబర్, డిసెంబర్ నెలల్లో 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. వీటిని కాస్త వెనక్కి జరిపి… ఏప్రిల్, మే నెలలో జరగాల్సిన 6 […]

అరె సార్.. జర మాట్లాడరాదె..

వరి కొనుగోలు సమస్య వచ్చిన వెంటనే అలర్ట్ అయిన సీఎం కేసీఆర్.. గంటలకొద్దీ వరుస ప్రెస్ మీట్లు.. ఇక్కడ బండి సంజయ్ మొదలు ఢిల్లీలో మోదీ మీద వరకు విమర్శలు.. కేంద్రం ఏం చేస్తలేదు.. బండి సంజయ్ నాటకాలాడుతున్నాడు.. అంటూ డైలాగుల మీద డైలాగులు.. మీరు కొంటరా..కొనరా చెప్పాలని డిమాండ్.. ఇక ఇందిరా పార్కులో ధర్నా.. కేంద్రం చెప్పి తీరాలె.. లేకపోతే ఢిల్లీ బోతం.. మెడలు వంచుతాం అంటూ ఆవేశపూరిత ప్రసంగం.. చెప్పినట్టుగానే ఢిల్లీ వెళ్లడం.. అక్కడ […]

‘కారు’ తిరిగొచ్చింది..‘బండి’ బయలుదేరుతుంది

వరి కొనుగోలు వ్యవహారం రాష్ట్రంలో ఇంకా కొద్దిరోజుల పాటు కొనసాగనుంది. ఈ విషయంలో అధికార టీఆర్ఎస్ పార్టీ, బీజేపీలు తప్పు మీదంటే మీదని ఒకరి మీద ఒకరు వేసుకుంటూ మీడియాలో నానుతున్నారు. ఎవరూ రైతుకు మేలు చేసిన దాఖలాలు కనిపించలేదు. ఓ వైపు వర్షం వచ్చి వరి ధాన్యం మొలకలెత్తుతోంది..మరోవైపు అన్నదాతలు వరిని కొనేవారు లేక ప్రాణాలు కోల్పోతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం రాజకీయాలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో వరి సమస్యను తేల్చుకునేందుకు సీఎం కేసీఆర్ […]

సారు.. వచ్చేశారు సిటీకి

నాలుగు రోజుల ఢిల్లీ పర్యటన ముగించుకున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర రాజధానికి వచ్చేశారు. గురువారం సాయంత్రం ఢిల్లీ నుంచి విమానంలో సిటీలో ల్యాండ్ అయ్యారు. వరి సమస్యపై మోదీతోపాటు కేంద్ర మంత్రులను కలుస్తామని ప్రజలకు చెప్పి తన టీమ్ తో హస్తినకు వెళ్లిన కేసీఆర్ కు అక్కడ ఎవరి దర్శనమూ కాలేదు. ఎంత ప్రయత్నించినా మోదీని కలిసే అవకాశం రాలేదు. దీంతో అక్కడే ఉండి చేసేది లేక తిరిగొచ్చేశారు. విచిత్రమేమంటే నాలుగు రోజుల పాటు ఒక […]

మూడు రోజులైంది.. ఇంకా ఎవ్వరినీ కలవలే..

‘‘మోదీ ప్రభుత్వం తెలంగాణను చిన్నచూపు చూస్తోంది.. రైతులను పట్టించుకోవడం లేదు.. అరె.. వరి కొంటారో, కొనరా చెప్పండయ్యా అంటే సమాధానం లేదు.. ఈ లొల్లేంది.. ఢిల్లీకి పోతాం.. అక్కడే తేల్చుకుంటాం’’ అని ధర్నా చౌకలో కేసీఆర్ మాట్లాడిన మాటలు ఇంకా చెవుల్లో మార్మోగుతున్నాయి. శభాష్.. సారు రైతుల కోసం ఎంతకైనా తెగిస్తాడు.. అన్నదాతకు మేలు జరుగుతుందని అందరూ సంతోషపడ్డారు. సారు చెప్పినట్లుగానే తన టీమ్ తో ఆదివారం ఢిల్లీకి బయలుదేరాడు. అంతే.. పోయి ఇంట్లో కూసున్నడు. ఇప్పటికి […]

సీఎం కేసీఆర్ బిజీ..బిజీ..

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల కాలంలో బాగా బిజీ అయ్యారు. రాష్ట్రంలో హుజూరాబాద్ ఉప ఎన్నికలు ముగిసి పరాజయం మూటగట్టుకున్న తరువాత ప్రభుత్వ, పార్టీ వ్యవహారాలను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. అందుకే ఈటల అనంతరం తన వద్దే ఉంచుకున్న వైద్య ఆరోగ్య శాఖను అల్లుడు హరీశ్ కు అప్పగించడమే నిదర్శనం. ఇటీవల కాలంలో బీజేపీ నేతలు ఏకంగా కేసీఆర్ కుటుంబాన్నే టార్గెట్ చేశారు. హుజూరాబాద్ లో ఈటల గెలవడంతో బీజేపీ జోష్ లోఉంది. ఇక పుండు మీద […]

ఢిల్లీ చుట్టూ చక్కర్లు.. అయినా రాలని కాసులు..

ఏపీ ఆర్థికశాఖా మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ దేశ రాజధాని ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. నెలకు ఒకటి, రెండు సార్లు హస్తినకు వెళ్లి వస్తున్నారు. ఆయన సమయమంతా ఢిల్లీకి వెళ్లి రావడానికే సరిపోతుంది. రాష్ట్రం ఆర్థిక పరిస్థి బాగాలేదు.. నిధులు ఇవ్వండి అని కేంద్రప్రభుత్వాన్ని అడగడానికి, వినతిపత్రాలు ఇవ్వడానికి నిత్యం హస్తినకు వెళుతున్నారు. అయితే డిల్లీ పెద్దలు మాత్రం స్పందించడం లేదు. బుగ్గన పరిస్థితి ఎలా ఉందంటే.. కేంద్ర మంత్రులను కలిస్తే చాలురా దేవుడా.. అనే పరిస్థితి […]

నేడు ఢిల్లీకి సీఎం జ‌గ‌న్‌..అమిత్ షాతో భేటీ అందుకేన‌ట‌?!

ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి రేడు ఢిల్లీ వెళ్ల‌నున్నారు. ఈ రోజు పదిన్నర గంటలకు విజయవాడ నుంచి ప్రత్యేక విమానంలో జగన్ బయలుదేరి మధ్యాహ్నం 2.15 గంటలకు ఢిల్లీలోకి చేరుకుంటారు. ఆ తర్వాత వరుసగా పలువురు కేంద్ర మంత్రులతో భేటీ అవుతారు. రాత్రి 9 గంటలకు ఆయన కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో భేటీ అవుతారు. మూడు రాజధానుల ఏర్పాటుకు సహకారం కోరడంతోపాటు, పోలవరం ప్రాజెక్టు బకాయిల విడుదలపై జలశక్తి మంత్రితో సీఎం చర్చించనున్నారు. అలాగే కరోనా […]

కెసియార్‌ కన్నెర్రజేయబట్టే! 

హైదరాబాద్‌ని కనీ వినీ ఎరుగని రీతిలో జల విలయం కుంగదీస్తోంది. హైదరాబాద్‌ అంతటా భారీ వర్షాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఒక్కరోజు కాదు, రోజుల తరబడి హైదరాబాద్‌ జల విలయంలో విలవిల్లాడుతుంటే ప్రభుత్వం ఏం చేస్తోంది? అన్న ప్రశ్న బాధిత ప్రజానీకం నుంచి ఉత్పన్నమవడం సహజమే. భారీ వర్ష సూచనతో ముందస్తుగా అధికార యంత్రాంగం జాగ్రత్త పడి ఉంటే సమస్య తీవ్రత కొంచెం తగ్గేదే. కానీ ప్రభుత్వంలో ఉన్నవారు పూర్తిగా నిర్లక్ష్యం వహించారు. అతి ముఖ్యమైన అంశమ్మీద ఢిల్లీ […]