తెలుగు రాష్ట్రాల్లో పాగా వేయడానికి బీజేపీ అస్త్రశస్త్రాలు సిద్ధం చేస్తోంది. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్లో భారీ విజయం సాధించిన తర్వాత.. ఆ రాష్ట్రంలో కొత్తగా ఏర్పడే ప్రభుత్వం రైతులకు `రుణమాఫీ` చేస్తుందని, ఆభారం కేంద్రమే భరిస్తుందని చేసిన కేంద్రమంత్రి పకటనతో.. ఇప్పుడు ఇద్దరు చంద్రుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. 2014 ఎన్నికల్లో రుణమాఫీ నే ప్రచారంగా చేసుకుని అటు చంద్రబాబు, ఇటు కేసీఆర్ అధికారాన్ని చేజిక్కించుకున్నారు. ఇప్పుడు అదే అస్త్రాన్ని 2019 ఎన్నికల్లో ఉపయోగించే దిశగా కేంద్రం అడుగులేస్తోంది. […]
Tag: AP
భూమా వర్గాన్ని బలహీనం చేస్తుంది ఎవరు?
నంధ్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి మరణంతో.. ఆయన వర్గం దిక్కలేనిది అయిపోయింది. ఇప్పటివరకూ నంధ్యాలలో పరిస్థితిని ఎలా కంట్రోల్ చేయాలో తెలియక తీవ్రంగా మధనపడింది పార్టీ అధిష్ఠానం! ప్రస్తుతం ఉన్న పరిస్థితులను పూర్తిగా తమ అధీనంలోకి తెచ్చుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. ఇప్పటి వరకూ బలంగా ఉన్న భూమా వర్గాన్ని బలహీనం చేసేందుకు వెనుక నుంచి శర వేగంగా పావులు కదుపుతోంది. నంద్యాల రాజకీయాలను తెలుగుదేశం పార్టీ నాయకులు ఆసక్తికరంగా మార్చేశారు. భూమా నాగిరెడ్డి మరణం తరువాత ఉప […]
2019 వార్: ఏపీ-తెలంగాణలో రాజకీయాలను శాసిస్తున్న కులాలు
రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ఏర్పడి అప్పుడే మూడేళ్లు గడిచిపోయింది. ఇక ఇప్పుడు అందరి దృష్టి మధ్యలో జరిగే చిన్నా చితకా ఎలక్షన్లతో పాటు 2019 ఎన్నికలపైనే ఉంది. 2019లో ఏపీ, తెలంగాణలో ఏ పార్టీ గెలుస్తుంది ? ఏ పార్టీల మధ్య ప్రధానంగా పోరు ఉంటుంది ? అసలు ఎవరి బలం ఎంత? ఎవరి బలగం ఎంత? ఒంటరిగా బరిలో నిలిచి ఒకే పార్టీ అధికారం దక్కించుకునే అవకాశం ఉందా ? ఇలా ఎన్నో ప్రశ్నలు […]
నంద్యాల టీడీపీ క్యాండెట్ ఖరారు..!
ఏపీలో మరో ఉప ఎన్నికకు రసవత్తర పోరు ఖాయంగా కనిపిస్తోంది. 2014లో సాధారణ ఎన్నికల తర్వాత మూడు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు వచ్చాయి. ఎన్నికల టైంలోనే మృతిచెందిన శోభా నాగిరెడ్డి స్థానంలో ఆమె కుమార్తె అఖిలప్రియ ఏకగ్రీవంగా గెలవగా, కృష్ణా జిల్లా నందిగామలో మృతిచెందిన తంగిరాల ప్రభాకర్రావు కుమార్తె సౌమ్య విజయం సాధించారు. ఇక తిరుపతిలో సిట్టింగ్ ఎమ్మెల్యే మున్నూరు వెంకటరమణ మృతి చెందగా అక్కడ జరిగిన ఉప ఎన్నికలో ఆయన భార్య సుగుణమ్మ లక్ష […]
ఏపీలో ఆ 3 ఎమ్మెల్సీలు టీడీపీకా …వైసీపీకా..!
ఏపీలో తీవ్ర ఉత్కంఠ పరిస్థితులు నెలకొన్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా స్థానిక సంస్థల కోటాకు సంబంధించిన మూడు జిల్లాల్లో శుక్రవారం పోలింగ్ జరుగుతోంది. స్థానిక సంస్థల కోటాలో మొత్తం 9 స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా అందులో 6 స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. ఇక వైసీపీకి మంచి బలం ఉన్న జగన్ సొంత జిల్లా కడపతో పాటు కర్నూలు, నెల్లూరు జిల్లాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలు తీవ్ర ఉత్కంఠను రేకెత్తిస్తున్నాయి. కడప జిల్లాలో జగన్ తన సొంత బాబాయ్ […]
టీడీపీ మూడో విడత ఆపరేషన్ ఆకర్ష్ స్టార్ట్..వైసీపీలో 3 వికెట్లు డౌన్..!
ఏపీలో అధికార టీడీపీ చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష్కు ఇటీవలే కాస్త బ్రేక్ పడింది. రెండు విడతలుగా జరిగిన ఈ ఆపరేషన్ ఆకర్ష్ దెబ్బకు 21 మంది విపక్ష వైసీపీ ఎమ్మెల్యేలతో పాటు కొందరు ఎమ్మెల్సీలు, ఒకరిద్దరు ఎంపీలు కూడా అధికార టీడీపీ గూటికి చేరిపోయారు. ఆపరేషన్ ఆకర్ష్ రెండో పేజ్ తర్వాత కాస్త గ్యాప్ వచ్చింది. ఇప్పుడు టీడీపీ మూడో విడత ఆపరేషన్ ఆకర్ష్కు తెరలేపినట్టు తెలుస్తోంది. మూడో విడత స్టార్టింగ్లోనే విపక్ష వైసీపీకి చెందిన ఇద్దరు […]
ఏపీ బీజేపీ నేతల దూకుడుకు బాబు కళ్లెం
ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తర్వాత.. ఏపీ రాజకీయ చిత్రంలో అనేక మార్పులు జరిగే వాతావరణం కనిపిస్తోంది. ఎవరు ఎవరికి మిత్రులు అవుతారో.. మరెవరు శత్రువులవుతారో కొద్ది రోజుల్లోనే స్పష్టత వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. బీజేపీని డీల్ చేసే విషయంలో టీడీపీ నాయకులు, టీడీపీతో వ్యవహరించే విషయంలో బీజేపీ నాయకుల్లోనూ కొంత మార్పు వచ్చినట్టే తెలుస్తోంది. ముఖ్యంగా ఏపీలో పార్టీని విస్తరించాలని బీజేపీ నాయకులు తహతహలాడుతున్నారు. విస్తరణకు ఇదే సరైన సమయమని పార్టీ పెద్దలకు చెబుతున్నారు. ఇదే […]
రోజాకు ఏమైనా ప్రత్యేక రూల్స్.. చట్టాలు ఉన్నాయా?
కొత్త అసెంబ్లీలోనూ అధికార, విపక్ష సభ్యుల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ముఖ్యంగా వైసీపీ ఎమ్మెల్యే రోజా, టీడీపీ ఎమ్మెల్యేలు అనిత, బోండా ఉమామహేశ్వరావు.. మధ్య గత అసెంబ్లీ సమావేశాల్లో జరిగిన గొడవపై విచారణ కొలిక్కి వచ్చింది. రోజాను `ఆంటీ` అని సంబోధించడం, తర్వాత మంత్రులు అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యే బోండాపై అనుచిత వ్యాఖ్యలు చేయడం.. ఇవన్నీ పెద్ద దుమారమే రేపాయి. ఇప్పుడు కొత్త అసెంబ్లీనీ ఈ అంశం కుదిపేస్తోంది. అయితే రోజాను `ఆంటీ` అనడంపై బోండా ఉమామహేశ్వరరావు […]
ఏపీ మంత్రి వర్గంలో `ఫ్యామిలీ` రాజకీయాలు
మంత్రి వర్గ విస్తరణ ముందు.. మంత్రుల గురించి ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి! అసలే మంత్రి పదవి ఉంటుందో ఊడుతుందో తెలియక ఒకపక్క తీవ్రంగా ఆందోళన చెందుతుంటే.. ఇప్పుడు వారిపై ఇంటెలిజెన్స్ వర్గాలు నివేదిక రూపొందించి.. సీఎం చంద్రబాబుకు అందించాయి. దీంతో అందులో ఏముందో తెలియక మంత్రులు ఒకటే టెన్షన్ పడుతున్నారు. మంత్రులుగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నా.. వెనకాల ఉండి చక్రం తిప్పేదంతా వారసులేననే విషయం ఈ నివేదిక ద్వారా వెలుగులోకి వచ్చిందట. వారసులే చక్రం తిప్పుతున్నారని, మంత్రులంతా […]