ఏపీలో ఏప్రిల్ 6న సీఎం చంద్రబాబు తన కేబినెట్ను ప్రక్షాళన చేస్తారని వార్తలు వస్తోన్న సంగతి తెలిసిందే. ఈ ప్రక్షాళనలో ఆయన తనయుడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్తో పాటు కొత్తగా నలుగురైదుగురు కేబినెట్లోకి ఎంట్రీ ఇస్తారని ప్రచారం జరుగుతోంది. అలాగే ఐదుగురు మంత్రులకు ఖచ్చితంగా ఉద్వాసన ఉంటుందని కూడా టాక్. ఇదిలా ఉంటే బాబు కేబినెట్లో బీజేపీ నుంచి ఇద్దరు మంత్రులుగా కొనసాగుతున్నారు. వీరిలో కైకలూరు నుంచి ఎమ్మెల్యేగా ఉన్న కామినేని శ్రీనివాస్తో పాటు […]
Tag: AP
ప్రజాక్షేత్రంలోకి జనసేన .. చివరి రోజున పవన్ బహిరంగ సభ
ఏపీలో 2019 ఎన్నికల్లో పోటీ చేస్తోన్న జనసేన అధినేత పవన్ ప్రజాసమస్యలు తెలుసుకునేందుకు ప్రజాక్షేత్రంలోకి దూకనున్నాడు. ఈ క్రమంలోనే వివిధ జిల్లాల్లో సమస్యలతో పాటు ఏపీకి ప్రత్యేక హోదా కోసం ఇప్పటికే నాలుగైదు సభలు పెట్టిన పవన్ ఇక ఇప్పుడు సీమలో కరువు ప్రాంతమైన అనంతపురం జిల్లా మీద తన ఫోకస్ పెట్టాడు. వచ్చే ఎన్నికల్లో పవన్ ఇదే జిల్లాలో ఏదో ఒక నియోజకకవర్గం నుంచి పోటీ చేస్తానని చెప్పడంతో ఈ జిల్లా మీద రోజు రోజుకు […]
దేవినేని తనయుడికి కీలక బాధ్యతలు
పార్టీలో యువశక్తిని బలోపేతం చేసేందుకు టీడీపీ సన్నద్ధమవుతోంది. అందుకు ఎన్నో రోజులుగా ఖాళీగా ఉన్న తెలుగు యువత అధ్యక్ష పదవిని తెరపైకి తెచ్చింది. ముఖ్యంగా ఇటీవలే కాంగ్రెస్ నుంచి టీడీపీలో చేరిన దేవినేని నెహ్రూ.. తనయుడు అవినాశ్కు ఈ పదవిని కట్టబెట్టబోతున్నట్లు తెలుస్తోంది. ఏపీ సీఎం చంద్రబాబు తనయుడు లోకేశ్కు.. అవినాశ్కు మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అలాగే తన సొంత వర్గాన్ని తయారుచేసుకునే పనిలో చినబాబు కూడా నిమగ్నమై ఉండటంతో.. ఇక అవినాశ్ ఎంపిక లాంఛనమే […]
బాబు నిన్నటి ఆనందం నేటితో ఆవిరి
ఆనందం ఇంతలోనే ఆవిరైపోయింది. గెలిచామన్న సంతోషం రాత్రి గడవగానే ఎగిరిపోయింది. నిన్న ఉల్లాసంగా కనిపించిన నేతలే.. నేడు నిరుత్సాహంతో కుంగిపోతున్నారు. ఏపీలో అధికార పక్షానికి ఊహించని షాక్ ఎదురైంది. కడప, నెల్లూరు, కర్నూలు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలను దక్కించుకుని ఊపు మీదున్న టీడీపీకి.. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎదురుదెబ్బ తగిలింది. ప్రతిపక్షం బలంగా ఉన్న జిల్లాల్లో గెలిచామని సంబరాలు చేసుకున్న సీఎం చంద్రబాబు ఆనందాన్ని.. టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు ఆవిరి చేశాయి. ఆంధ్రప్రదేశ్లోని రెండు పట్టభద్రుల […]
వైసీపీలోకి మంచు ఫ్యామిలీ ఎంట్రీ..!ఆ రెండు నియోజకవర్గాలపై కన్ను..!
టాలీవుడ్లో మంచు ఫ్యామిలీకి సపరేట్ క్రేజ్ ఉంది. విలక్షణ నటుడు మోహన్బాబు రూటే ఓ సపరేటుగా ఉంటుంది. మోహన్బాబుకు ఇటు సినిమా రంగంతో పాటు అటు రాజకీయ రంగంతోను ఎంతో అనుబంధం ఉంది. ఏపీలో అధికారంలో ఉన్న టీడీపీతో పాటు విపక్ష వైసీపీతోను ఆయనకు చాలా దగ్గరి రిలేషన్ ఉంది. ఏపీ ప్రస్తుతం సీఎం చంద్రబాబు మోహన్బాబుకు వరుసకు మేనత్త కొడుకు అవుతాడు. ఇక విపక్ష వైసీపీ అధినేత జగన్ అయితే అల్లుడు వరుస అవుతాడు. గతంలో […]
పవన్ పోటీ చేసే నియోజకవర్గంపై క్లారిటీ..అనంతపురం అయితే కాదు
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ 2019 ఎన్నికల బరిలో ఉండడం ఫిక్స్ అయ్యింది. పవన్ ఇప్పటికే రెండుమూడుసార్లు జనసేన 2019 ఎన్నికల్లో ఏపీ, తెలంగాణలో పోటీ చేస్తుందని, తాను రాయలసీమలోని అనంతపురం జిల్లా నుంచి పోటీ చేస్తానని స్పష్టమైన క్లారిటీ ఇచ్చారు. దీంతో ఏపీలో 2019 ఎన్నికలు మూడు ముక్కలాటను తలపించడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక తాను ఎమ్మెల్యేగా అనంతపురం జిల్లా నుంచే పోటీ చేస్తానని చెప్పడంతో రాజకీయంగా పవన్ పోటీ చేసే నియోజకవర్గంపై పెద్ద చర్చ […]
తబ్బిబ్బైపోతున్న కాపు నేతలు … కారణం అదే !
అంతెత్తున ఎగిసిన కాపు ఉద్యమం చప్పగా చల్లారిపోయింది. అప్పట్లో వార్తల్లో నిలిచిన కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం పేరు.. ఇప్పుడు వినిపించడమే మానేసింది. ప్రస్తుతం బడ్జెట్లో కాపు కార్పొరేషన్కు రూ.1000కోట్లు కేటాయించి.. ఏపీసీఎం చంద్రబాబు తన మార్క్ మరోసారి చూపించారు. కాపులకు అన్యాయం జరుగుతోందని విమర్శిస్తున్న వారు కిక్కురుమనకుండా చేసేందుకు.. కాపు ఉద్యమాన్ని మరింత నీరుగార్చేందుకు ఇప్పుడు బాబు సరికొత్త వ్యూహంతో చంద్రబాబు రంగంలోకి దిగుతున్నారు. కాపుల తరఫున ముద్రగడ పద్మనాభంఉద్యమిస్తున్నా… అడుగడుగునా ఆ ఉద్యమాన్ని అణిచివేయడానికే […]
చంద్రబాబు రాజీ చేసినా తీరు మారని నాయకులు … తక్షణం కర్తవ్యం?
ఏపీలో అధికార టీడీపీకి నాయకుల మధ్య గొడవలు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. పదేళ్ల తర్వాత పార్టీ అధికారంలోకి వచ్చిందన్నమాటే గాని చంద్రబాబుకు నాయకుల మధ్య గొడవలు సర్దుబాటుతోనే సగం కాలం గడిచిపోతోంది. టీడీపీ వర్సెస్ టీడీపీ నాయకులతో పాటు టీడీపీ వర్సెస్ బీజేపీ నాయకుల మధ్య అస్సలు పొసగడం లేదు. ఈ క్రమంలోనే పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం బీజేపీ తరపున ఎమ్మెల్యేగా గెలిచి చంద్రబాబు కేబినెట్లో మంత్రిగా కొనసాగుతోన్న పైడికొండల మాణిక్యాలరావుతో పాటు జిల్లా పరిషత్ […]
టీడీపీ 3 – వైసీపీ 0…. ఓటమి జగన్కు రాజకీయంగా పెద్ద దెబ్బే
ఏపీలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార టీడీపీ తన దూకుడు చూపించింది. స్థానిక సంస్థలకు జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో కడప, కర్నూలుతో పాటు నెల్లూరు ఎమ్మెల్సీలను టీడీపీ కైవసం చేసుకుంది. శుక్రవారం ప్రారంభమైన కౌంటింగ్లో ముందుగా నెల్లూరుతో టీడీపీ బోనీ కొట్టింది. ఇక్కడ టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన సిట్టింగ్ ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి వైసీపీ అభ్యర్థి ఆనం విజయ్కుమార్రెడ్డిపై 87 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఓట్ల కౌంటింగ్ ప్రారంభమైన కొద్దిసేపటికే టీడీపీ అభ్యర్థి […]