శ్రీకాకుళం వైసీపీ ఎంపీ కోసం వేట…!

శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గంపైన వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలుస్తోంది. వరుసగా రెండుసార్లు ఓడిన నియోజకవర్గాన్ని ఈసారి ఎలాగైనా గెలుచుకోవాలనే పట్టుదలతో జగన్ మోహన్ రెడ్డి ఉన్నట్లు తెలుస్తోంది. 2014లో తొలిసారి పార్లమెంట్‌లో అడుగుపెట్టిన కింజరాపు రామ్మోహన్ నాయుడు… ప్రస్తుతం జాతీయస్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. దీంతో రామూను ఓడించాలంటే అంతే స్థాయి నేత ఉండాలనేది జగన్ ఆలోచన. 2014లో వైసీపీ తరఫున పోటీ చేసిన రెడ్డి శాంతి… ప్రస్తుతం […]

టీడీపీలో అనిత చుట్టూ బిగుస్తున్న ఉచ్చు…!

రాబోయే ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే గట్టి పట్టుదలతో ఉన్నారు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు. అయితే పార్టీలో మాత్రం సీనియర్ జూనియర్ వార్ తారాస్థాయికి చేరుకుంది. ఎప్పటి నుంచో పార్టీలో ఉన్న నేతలకు… కొత్తగా పార్టీలోకి వచ్చిన నేతలకు మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు జెండా మోసిన కార్యకర్తలే అసలైన నేతలని గతంలో చంద్రబాబు ఎన్నోసార్లు చెప్పుకొచ్చారు. అయితే అది కార్యచరణలో మాత్రం పూర్తి విరుద్ధంగా మారిపోయింది. పార్టీ ప్రతిపక్షంలో […]

రాంగ్ ట్రాక్‌లో వెళ్తున్న జనసేనాని… ఇలా అయితే అయినట్లే…?

పవన్ కల్యాణ్… సినిమా హీరో కంటే కూడా జనసేన పార్టీ అధినేతగానే ఎక్కువ పాపులారిటీ సంపాదించుకున్నారు. ఆయన ఇప్పుడు ఎక్కడ మీటింగ్ పెట్టినా సరే.. జగన్ తండోపతండాలుగా వస్తున్నారు. ర్యాలీలు, చప్పట్లు… సీఎం సీఎం అంటూ నినాదాలు… అంతా బాగానే ఉంది కానీ… అసలు జనసేన పార్టీ నేతలెవరు… పవన్ కాకుండా ఆ పార్టీలో ఇతర నేతలెవరైనా ఉన్నారా… ఇదే ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న. రాబోయే ఎన్నికల్లో వైసీపీ ఓడించడమే లక్ష్యమని ఇప్పటికే పవన్ పలుమార్లు […]

నేనే హోమ్ మినిష్టర్…. రాసిపెట్టుకో.. సిగపట్లు పడుతున్న టీడీపీ నేతలు…!

నేనే హోమ్ మినిష్టర్… గెలుపు కూడా లాంఛనమే… కావాలంటే రాసి పెట్టుకో.. ఈ మాట అంటున్నది ఎవరో కాదు… టీడీపీలో ఇద్దరు కీలక నేతలు. ఆలు లేదు.. సూలు లేదు… కొడుకు పేరు సోమలింగం అన్నాడట వెనకటికి ఒకడు… అనేది పెద్దల మాట. ప్రస్తుతం ఈ మాట.. ఆ ఇద్దరు నేతలకు సరిగ్గా సరిపోతుంది. ఆ ఇద్దరు నేతలు ఎవరో కాదండి… ఒకరేమో టీడీపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు… మరొకరేమో… తెలుగు మహిళ అధ్యక్షురాలు […]