మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రంగస్థలం లాంటి బ్లాక్బస్టర్ తర్వాత సుకుమార్ డైరెక్షన్లో మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమా కోసం రంగం సిద్ధమవుతుంది. ఈ క్రమంలోనే సినిమాకు సంబంధించిన ఏదైనా అప్డేట్ వస్తే బాగుండని ఫ్యాన్స్ అంతా ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. పుష్ప ఫ్రాంఛైజ్ సినిమాల సాలిడ్ సక్సస్ తర్వాత.. డైరెక్టర్ సుకుమార్ రూపొందిస్తున్న సినిమా ఇది.
ఈ క్రమంలోనే సినిమాపై ఆడియన్స్ లో భారీ ఆసక్తి నెలకొంది. కేవలం తెలుగు ప్రేక్షకుల్లోనే కాదు.. పాన్ ఇండియా లెవెల్ ఆడియన్స్లో ఈ సినిమాపై భారీ హైప్ మొదలైంది. ఇక సుకుమార్.. ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్ట్ పనుల్లో బిజీ బిజీగా గడుపుతున్నాడు. ఈ క్రమంలోని స్క్రిప్ట్ పనులు తుది దశకు చేరుకున్నాయని టాక్. ఇక.. ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్ట్ పనులన్నీ దుబాయ్ లో ఉంటూనే సుకుమార్ చక్క పెట్టేస్తున్నాడు. దాదాపు అన్ని పనులు కంప్లీట్ అయ్యాయని.. సినిమాకు కంటెంట్ సిద్ధంగా ఉందని తెలుస్తుంది.
ఇలాంటి క్రమంలో.. ఫ్యాన్స్ కు సరికొత్త ఉత్సాహాన్ని నింపే ఒక క్రేజీ అప్డేట్ నెట్టింట వైరల్ గా మారుతుంది. అదే సినిమా రెగ్యులర్ షూట్.. వచ్చే ఏడాది ఫిబ్రవరి నెలలోనే ఈ మూవీ మొదలవుతుందని తెలుస్తుంది. ఇకరెగ్యులర్ షూటింగ్ను మొదలుపెట్టి వీలైనంత త్వరగా సినిమాను పూర్తి చేయాలని సుకుమార్ ప్లాన్ చేస్తున్నాడట. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ ప్రొడ్యూసర్లుగా వ్యవహరించరున్నారు. ఇక.. ఈ సినిమా 2026 సెకండ్ హాఫ్ లో రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఈ సినిమాతో చరణ్ ఎలాంటి హైన్ క్రియేట్ చేస్తాడో.. ఏ రేంజ్ లో సక్సెస్ అందుకుంటాడో చూడాలి.