శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన తాజా మూవీ కుబేర. ఇటీవల భారీ అంచనాల నడుమ రిలీజై.. బ్లాక్ బస్టర్గా నిలిచిన సంగతి తెలిసిందే. బాక్సాఫీస్ దగ్గర విజయవంతంగా దూసుకుపోతున్న ఈ సినిమా.. మూడు రోజుల్లో ఏకంగా రూ.80 కోట్ల గ్రాస్ వసుళ్లను కొల్లగొట్టింది. మరో రూ.25 కోట్ల కలెక్షన్లు వస్తే చాలు.. సినిమా లాభాల్లోకి అడుగుపెడుతుంది. ఈ క్రమంలోనే.. సినిమా సక్సెస్ మీట్ ను గ్రాండ్ లెవెల్ లో నిర్వహించారు మేకర్స్. ఇక హైదరాబాద్లో జరిగిన ఈ ఈవెంట్కు చిరంజీవి స్పెషల్ గెస్ట్గా హాజరైస్ సందడిశారు. సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్కరిపై ప్రశంసల వర్షం కురిపించిన చిరంజీవి.. అందరికీ శుభాకాంక్షలు తెలియజేశాడు. ఈవెంట్ అంతా అద్భుతంగా పూర్తి అవుతుంది అనే నేపథ్యంలో శేఖర్ కమ్ముల స్పీచ్ చివర్లో.. నిర్మాత ప్రవర్తనకు చిరంజీవి సైతం షాక్ అయ్యాడు.
ఎంతో సీనియారిటీ ఉన్న పెద్ద డైరెక్టర్లకే ఇలాంటి పరిస్థితి నెలకొంటే.. ఇండస్ట్రీలోకి కొత్తగా వచ్చే డైరెక్టర్ల పరిస్థితి ఏంటో.. నటీనటుల సంగతి ఏంటో.. అంటూ సోషల్ మీడియాలో శేఖర్ కమ్ముల అభిమానులతో పాటు నెటిజన్లు మండిపడుతున్నారు. అసలు మ్యాటర్ ఏంటంటే.. శేఖర్ కొమ్ముల తన స్పీచ్ మొత్తం పూర్తయ్యాక.. కింద కూర్చున్న డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్లు అతనితో ఒకే ఒక్క ఫోటో కావాలని శేఖర్ కమ్ములను అడిగారు. అప్పుడు శేఖర్ కమ్ముల రండి స్టేజి పైకి వచ్చేస్తే.. గ్రూప్గా ఫోటో దిగుదాం అని చెప్తాడు. ఇంతలోపు నిర్మాతల్లో ఒకరు స్టేజ్ పైకి వచ్చి.. శేఖర్ కమ్ములతో చాలా సీరియస్ గా మాట్లాడాడు. మైక్ కాస్త దగ్గరగా ఉన్న క్రమంలో వాళ్ళిద్దరి మధ్య కాన్వర్జేషన్ బయటకు వినిపించింది.
ఆ నిర్మాత నోటి నుంచి.. ఎంత సేపు మాట్లాడతావు. చిరంజీవి గారు, నాగార్జున గారి లాంటి వాళ్లు మాట్లాడాల్సి ఉంది అంటూ గుర్తు చేస్తున్నాడు. ఎంత పెద్ద స్టార్ కి అయినా.. ఇలాంటివి చెప్పాల్సిందే. కానీ చెప్పే విధానం వేరే ఉంటుంది. ఆ విధానంలో చెప్పలేదని ఆడియో వింటే క్లియర్ గా అర్థమవుతుంది. ఈ ఘటన క్రింద నుంచి చూస్తున్న మెగాస్టార్ అసలేం జరుగుతుంది అన్నట్లుగా సీరియస్ రియాక్షన్ ఇచ్చాడు. తర్వాత నిర్మాత కుమార్తెను పిలిపించి మెగాస్టార్ చిరంజీవి ఏదో మాట్లాడాడు. అయితే ఇంత జరిగినా శేఖర్ కమ్ముల స్పాంటేనియస్ని మెచ్చుకోవాలి. ఆయన వెనక్కు తగ్గకుండా.. స్పీచ్ పూర్తి చేసి.. తన డిపార్ట్మెంట్ మొత్తాన్ని స్టేజి పైకి పిలిచి ఫోటో ఇచ్చాకే స్టేజ్ దిగ్గాడు.