ఇటీవల చెన్నై డ్రగ్స్ కేస్ నెటింట పెద్ద దుమారమే రేపిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా.. ఈ కేసు మరో కీలక మలుపు తీసుకుంది. ఇందులో టాలీవుడ్ హీరో శ్రీరామ్ ఇరుకోవడం మరింత హాట్ టాపిక్ గా మారింది. తిరుపతికి చెందిన శ్రీరామ్ను ప్రస్తుతం చెన్నై పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.మొదట శ్రీరామ్కు వైద్య పరీక్షల నిర్వహించేందుకు రక్తన మూణాలను సేకరించిన పోలీసులు.. అనంతరం నుంగంబక్కం స్టేషన్కు శ్రీరాముల తరలించారు. ఈ క్రమంలోనే దాదాపు రెండు గంటల నుంచి చెన్నై నార్కోటిక్స్ ఇంటెలిజెన్స్ యూనిట్ పోలీసులు.. శ్రీరామ్ను విచారిస్తున్నారు.
రోజాపూలు సినిమాతో తెలుగు, తమిళ్ ఇండస్ట్రీలో ఒకేసారి ఎంట్రీ ఇచ్చిన శ్రీరామ్.. ఎన్నో సినిమాలో నటించి తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నాడు. ఇక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. మాజీ ఏఐడీఎంకే కార్యనిర్వాహకుడు ప్రసాద్ నుంచి శ్రీరామ్ డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన ప్రసాద్తో పాటుగా.. మరో ఇద్దరు ఇచ్చిన ఫిర్యాదుల మేరకు శ్రీరామ్ని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు.
ఈ డ్రగ్స్ కేసులో శ్రీరామ్ పేరు బయటకు రావడంతో.. ఒక్కసారిగా ఇండస్ట్రీలో సంచలనం సృష్టించింది. ప్రస్తుతం శ్రీరామ అరెస్ట్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా ట్రెండ్ అవుతుంది. ఇక గతేడాది ఈటీవీ విన్లో విడుదలైన వళ్లారి సినిమాతో శ్రీరామ్ తెలుగు స్ట్రాంగ్ రీ ఎంట్రీ ఇచ్చారు. ఇక ఆయన హీరోగా నటించిన ఎర్ర చీర సినిమా త్వరలోనే ఆడియన్స్ను పలకరించనుంది. ఇలాంటి క్రమంలో శ్రీరామ్ అరెస్టు కావడం అందరికీ షాక్ను కలిగిస్తుంది. ఇక ముందు ముందు ఈ కేస్ మరెన్ని మలుపులు తిరుగుతుందో.. ఎవరెవరి పేర్లు బయటకు వస్తాయో చూడాలి.