కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ నటించిన కుబేర మూవీ భారీ అంచనాలను నడుమ జూన్ 20న గ్రాండ్ గా రిలీజ్ ఆడియన్స్ను ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. నాగార్జున, రష్మిక మందన కీలకపాత్రలో నటించిన ఈ సినిమా.. ఫస్ట్ డే ఫస్ట్ షో నుంచి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. సరైన హిట్ కోసం ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నా ట్రేడ్ వర్గాలకు ఒక సరైన ట్రిట్ దొరికినట్లయ్యింది. సోషల్ మీడియాలో.. బయట.. ఎక్కడా కూడా ఈ సినిమాపై చిన్న నెగటివ్ టాక్ కూడా రాలేదంటే సినిమా రిజల్ట్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అసలే కరువుకాలం.
యావరేజ్ టాక్ వచ్చిన జనాలు బ్రహ్మరథం పడుతున్న నేపథ్యంలో.. ఈ రేంజ్ బ్లాక్ బస్టర్ టాక్ వస్తే.. సినిమాకు ఏ రేంజ్లో కలెక్షన్లు వస్తాయో అసలు గెస్ చేయలేరు. ఈ క్రమంలోనే సినిమాకు ఫస్ట్ డే బుక్ మై షో ద్వారా 3.40 లక్షల టికెట్లు అమ్ముడుపోయాయి. అంటే సినిమా ఏ రేంజ్ లో సంచలనం సృష్టించింది అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు.. ఈ ఏడాదిలో సౌత్ లోనే ఈ రేంజ్ టికెట్లు అమ్ముడుపోయిన ఏకైక సినిమా కుబేర. అయితే.. సినిమాకు వస్తున్న కలెక్షన్లు కూడా అదే రేంజ్లో ఉన్నాయి. తెలుగు వర్షన్ నుంచి భారీ లెవెల్ లో కలెక్షన్లు వస్తుండగా.. ధనుష్ కేరాఫ్ అయ్యిన తమిళ్ ఇండస్ట్రీలో మాత్రం తెలుగు వర్షన్లో వచ్చిన 50% కలెక్షన్లు కూడా రాకపోవడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. తెలుగు డైరెక్టర్ సినిమానే కానీ.. ఎంతైనా హీరో తమిళ వాడే. ఆయనకు అక్కడ ఉన్న క్రేజ్, పాపులారిటీ వేరే లెవెల్.

అలాంటిది కనీసం ఆయన స్థాయి ఓపెనింగ్స్ అయినా ఆ ప్రాంతం నుంచి రావాలి. కానీ.. కేవలం రూ.5 కోట్ల గ్రాస్ వసూళ్లు మాత్రమే సినిమాకు రావడం.. రెండో రోజు కూడా ఇదే రేంజ్ లో కలెక్షన్ రావడం అందరికి షాక్ను కలిగిస్తుంది. తమిళనాడులో యావరేజ్గా వసూళ్లు వస్తుంటే.. తెలుగులో మాత్రం సినిమా స్టడీగా భారీ కలెక్షన్లతో దూసుకుపోతుంది. ఇక తమిళ్లో ఈ సినిమాకు రిలీజ్ కు ముందు రూ.18 కోట్ల ప్రీ థియెట్రికల్ బిజినెస్ జరగగా.. సినిమా సూపర్ హిట్ అవ్వాలంటే కచ్చితంగా రూ.40 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను కొల్లగొట్టాల్సింది. ప్రస్తుతం రెండు రోజులకు తమిళ్లో రూ.10 కోట్ల గ్రాస్ వసూళ్లు కూడా వచ్చినట్లు కనిపించడం లేదు. వీకెండ్లోనే వసూళ్లు రాకుంటే.. ఇక వర్కింగ్ డేస్లో సినిమాకు ఏ రేంజ్లో వసూళ్లు వస్తాయి.. అసలు సినిమా తమిళనాడులో బ్రేక్ ఈవెన్ అవుతుందా.. లేదా.. అనే సందేహాలు కూడా మొదలయ్యాయి. ఈ క్రమంలోని తమిళ్లో సినిమా పెద్ద డిజాస్టర్ అయిన ఆశ్చర్యపనవసరం లేదని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.