ఇండస్ట్రీలో ఓ సినిమా సెట్స్పైకి వచ్చిన తర్వాత ఏఓ కారణాలతో దర్శకులు మారుతూ ఉండే సందర్భాలు చాలానే ఉంటాయి. వాటికి బెస్ట్ ఎగ్జాంపుల్ తాజాగా పూర్తయిన హరిహర వీరమల్లు. మొదట కృష్ డైరెక్షన్లో ప్రారంభమైన ఈ సినిమా.. తాజాగా జ్యోతి కృష్ణ డైరెక్షన్లో ముగిసిన సంగతి తెలిసిందే. అంతేకాదు.. గతంలో తెరకెక్కి మంచి సక్సెస్ అందుకున్న డెవిల్ మూవీ సైతం.. నవీన్ మేడారం డైరెక్షన్లో ప్రారంభమైనా.. చివరకు దర్శకుడుగా ప్రొడ్యూసర్ అభిషేక్ నామ పేరు ప్రింట్ అయిన సంగతి తెలిసిందే. అయితే.. ఇలాంటి సందర్భాలు ఇండస్ట్రీలో చాలానే ఉన్నాయి. కానీ.. తెలుగులో ఒక సినిమా మాత్రం అసలు డైరెక్టర్ పేరే లేకుండా రిలీజ్ అయిందట. ఇంతకీ ఆ మూవీ ఏంటి.. అసలు స్టోరీ ఏంటో తెలుసుకుందాం.
డైరెక్టర్ లేకుండా ఏ కథకు రూపకల్పన జరగదు. అసలు సినిమానే తెరకెక్కదు. అందుకే కెప్టెన్ ఆఫీస్ షిప్ అని.. డైరెక్టర్స్ను అంటూ ఉంటారు. ఓ సినిమా సక్సెస్ అయినా.. ఫెయిల్యూర్ అయినా.. ఆ ప్రభావం హీరోల కంటే ఎక్కువగా.. దర్శకులపై పడుతుందనటంలో సందేహం లేదు. అలాంటిది.. డైరెక్టర్ పేరు లేకుండా ఏ సినిమా రిలీజై ఉంటుంది.. అసలు ఇంతకీ ఆ మూవీ హీరో ఎవరు.. ఎందుకలా డైరెక్టర్ లేకుండా సినిమా రిలీజ్ అయింది ఒకసారి చూద్దాం. ఆ మూవీ మరేదో కాదు.. రాజశేఖర్, వడ్డే నవీన్ కాంబోలో తెరకెక్కిన శుభకార్యం. 2001లో రిలీజ్ అయిన ఈ సినిమా టాలీవుడ్ సీనియర్ డైరెక్టర్ రవిరాజా పిన్ని శెట్టి డైరెక్షన్లో ప్రారంభమైంది. సీనియర్ నిర్మాత సీ. కళ్యాణ్.. ఈ సినిమాను ప్రారంభించారు. అయితే సినిమా షూట్ టైంలో.. రాజశేఖర్, రవిరాజా పిన్నిశెట్టి మధ్య భేదాభిప్రాయాలు రావడంతో.. శుభకార్యం మూవీ పూర్తి చేయకుండానే మధ్యలో సినిమా నుంచి తప్పకుండా రవిరాజా పిన్నిశెట్టి.
అద్దాంతరంగా ఈ సినిమా నుంచి అతను తప్పుకోవడంతో.. అతడి స్థానంలో బొబ్బిలి వంశం ఫేమ్ అదియమాన్ డైరెక్షన్లో మిగతా సినిమా పూర్తి చేయించాడు.. ప్రొడ్యూసర్ సి.కళ్యాణ్. అయితే.. సినిమా అంత పూర్తయిన తర్వాత.. సినిమాకు దర్శకుడుగా తన పేరును వేయమంటూ రవిరాజా పిన్నిశెట్టి కంప్లైంట్ చేయడం అప్పట్లో హాట్ టాపిక్గా మారింది. ఇలాంటి క్రమంలో.. మిగతా సినిమాను పూర్తి చేసిన అదియమాన్ పేరు కూడా వేయకుండా.. అసలు దర్శకుడు పేరు లేకుండా మొదట సినిమాను రిలీజ్ చేశారు మూవీ టీం. ఇద్దరు దర్శకులకు క్రెడిట్ ఇవ్వకుండా చివరకు డైరెక్టర్ పేరే లేకుండా రిలీజ్ అయిన ఏకైక తెలుగు సినిమాగా శుభకార్యం నిలిచిపోయింది. అయితే అప్పట్లో ఈ మూవీ బాలకృష్ణ బ్లాక్ బస్టర్ మూవీ.. నరసింహనాయుడు సినిమాకు కాపీ అంటూ రకరకాల ఆరోపణలు వినిపించాయి. ఇక బాలయ్య నటించిన నరసింహనాయుడు బ్లాక్ బస్టర్ కాగా.. శుభకార్యం మూవీ మాత్రం ఎప్పుడు థియేటర్లకు వచ్చిందో తెలియక ముందే.. థియేటర్ల నుంచి తప్పుకుంది.