ఇటీవల కాలంలో ఎక్కడ చూసినా ఇండస్ట్రీలో డ్రగ్స్ వ్యవహారం హాట్ టాపిక్గా మారిపోతున్న సంగతి తెలిసిందే. ప్రముఖ హీరోలు, సెలబ్రెటీలు, డైరెక్టర్ల పేర్లు ఎక్కువగా ఈ డ్రగ్ ఇష్యులో మారుమోగుతున్నాయి. అంతేకాదు.. ఎక్కడ డ్రగ్స్ పట్టుబడిన అందరివేళ్ళు స్టార్ సెలబ్రిటీలు వైపే చూపిస్తున్న నేపథ్యంలో.. ఈ వార్తలు మరింత చర్చినీయాంశంగా మారాయి. గతంలో.. పలుసార్లు.. సినీ ఇండస్ట్రీలో డ్రగ్స్ వివాదాలు సంచలనం సృష్టించినా.. ఇటీవల కాలంలో ఇవి మరింతగా ఎక్కువ అవడంతో.. ఇండస్ట్రీలో ప్రముఖులు వీటిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఫిక్స్ అయ్యారు. ఈ క్రమంలోనే.. ఇండస్ట్రీ తీసుకున్న నిర్ణయం సంచలనంగా మారింది. మరీ ముఖ్యంగా.. మలయాళ ఇండస్ట్రీ ప్రముఖ డైరెక్టర్ల డ్రగ్స్ ఆరోపణలు ఎదుర్కొంటున్న క్రమంలో.. కొంతమంది హీరోలు, నటీమణులు, డైరెక్టర్స్ సైతం ఈ డ్రగ్స్ ఇష్యుల్లో చిక్కుకొని శతమాతమవుతున్నారు.
అంతేకాదు.. వారు డ్రగ్స్ తీసుకొని షూటింగ్కి రావడం.. సెట్స్లో మత్తుపదార్థాలు వాడటం.. బహిరంగంగానే కొంతమంది హీరోయిన్లు ఆరోపణలు చేయడం ఇండస్ట్రీలో మరింత హాట్ టాపిక్గా మారింది. డ్రగ్స్ వినియోగిస్తున్నారని ఆరోపణల్లో నేపథ్యంలో గతంలో దసరా విలన్ షైన్ టామ్ చౌక్, మలయాళ డైరెక్టర్ ఖలీద్ రెహ్మాన్, అష్రఫ్ హాంజాలు ఎన్నో సమస్యలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే మలయాళ ఇండస్ట్రీ ముందు జాగ్రత్తగా కఠిన చర్యలు తీసుకోవాలని ఫిక్స్ అయిందట. ఇకపై ఇండస్ట్రీకి ఎలాంటి తప్పుడు పేరు రాకూడదని ఉద్దేశంతో.. ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు సమాచారం. అయితే.. ఎప్పటినుంచో ఓ సినిమా రావాలంటే టీం ఖచ్చితంగా అగ్రిమెంట్ పై సైన్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు అదే అగ్రిమెంట్లో మరో పేపర్ ఇండస్ట్రీ జోడించినట్లు తెలిస్తుంది.
ఎవరికైనా సినిమా సైన్ చేయాలంటే సెట్స్లో డ్రగ్స్ వినియోగం అసలు లేకుండా చూస్తామని.. కొత్త అఫిడవిట్పై సైన్ చేయాలని.. అప్పుడే ఈ సినిమా సెట్స్పైకి వస్తుందని తెలుస్తోంది. అది నటినటులే కావచ్చు.. టెక్నికల్ టీం, హీరో, హీరోయిన్, డైరెక్టర్ ఎవరైనా సరే.. ఈ కండిషన్స్ కు ఒప్పుకొని సైన్ చేస్తేనే సినిమా పర్మిషన్ దొరుకుతుందని ఇండస్ట్రీ ప్రముఖులు అంత ఈ కొత్త రూల్ను తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. తాజాగా పెట్టిన రూల్ ప్రకారం.. ఎలాంటి హీరో అయినా.. ఎంత పెద్ద పాన్ ఇండియన్ సెలబ్రిటీ అయినా సరే.. సినిమా ఒప్పుకోవాలంటే కచ్చితంగా డ్రగ్స్ తీసుకోమని పేపర్ల పైన సంతకం చేయాల్సిందేనట. ఈ నిర్ణయం నిజమై.. అఫిడవిట్ రూల్ తీసుకొస్తే మాత్రం చాలా వరకు డ్రగ్స్ వాడకంకు చెక్ పడుతుందంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.