పాన్ ఇండియన్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా.. మారుతి డైరెక్షన్లో రూపొందుతున్న కామెడీ హారర్ ఎంటర్టైనర్ రాజాసాబ్. ఈ సినిమాపై ఇప్పటికే ఆడియన్స్లో పిక్స్ లెవెల్ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉన్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఆడియన్స్లో సినిమాపై ఆసక్తి మరింతగా మొదలైంది. ఎప్పుడు సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తారా.. ఎప్పుడెప్పుడు సినిమా చూద్దామా అంటూ కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు అభిమానులు. ఇలాంటి క్రమంలో షూటింగ్ ఆలస్యం అవుతుండడంతో.. రిలీజ్ అంతకంతకు వాయిదా పడుతూ వస్తుంది.
ఈ క్రమంలోనే.. తాజాగా అభిమానుల్లో జోష్ నింపేందుకు యూనిట్ ఓ క్రేజీ అప్డేట్ను అందించారు. రాజాసాబ్ ఆగమనం త్వరలోనే ఉందంటూ క్లారిటీ ఇచ్చారు. తాజాగా.. మూవీ టీజర్కు సంబంధించిన క్రేజీ అప్డేట్ ను షేర్ చేసుకున్నారు. త్వరలోనే రాజాసాబ్ ఆగమనం అంటూ అఫీషియల్ గా ట్విటర్ వేదికగా షేర్ చేయడంతో.. ప్రస్తుతం ఈ పోస్టర్ నెట్టింట హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. ఇక ఈ సినిమా టీజర్ జూన్ 15, 2025న గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానుంట.
అదే రోజున సినిమా రిలీజ్ తేదీ పై కూడా అఫీషియల్ ప్రకటన వచ్చే అవకాశం ఉందని ఫిలిం వర్గాల్లో టాక్ నడుస్తుంది. ఇక సినిమాలో నిధి అగర్వాల్, రిద్దీ కుమార్ హీరోయిన్లుగా నటిస్తుండగా.. సంజయ్ దత్త్ విలన్ పాత్రలో మెరవనున్నాడు. ఈ క్రమంలోనే సినిమా రిలీజై.. ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో వేచి చూడాలి.
Tomorrow at 10:34 AM 📸 #Prabhas #TheRajaSaab
— The RajaSaab (@rajasaabmovie) June 2, 2025