టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు రాజమౌళి కాంబోలో ప్రస్తుతం ఎస్ఎస్ఎంబి 29 రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే సినిమా సెట్స్పైకి రాకముందే.. ఆడియన్స్లో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఫారెస్ట్ అడ్వెంచర్స్ థ్రిల్లర్గా రూపొందుతున్న ఈ సినిమాను.. శ్రీ దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై కే. ఎల్. నారాయణ ఏకంగా రూ.1500 కోట్ల భారీ బడ్జెట్లో రూపొందిస్తున్నాడు. ఇక ఈ సినిమా కోసం జక్కన్న నేషనల్ లెవెల్ కాదు.. ఇంటర్నేషనల్ లెవెల్ మార్కెట్ టార్గెట్ చేయనున్నాడు. ఈ క్రమంలోనే సినిమాకు సంబంధించిన ప్రతి చిన్న విషయంలోనే ఆచితూచి అడుగులు వేస్తున్నాడు.
ఫారెస్ట్ అడ్వెంచర్స్ బ్యాక్ డ్రాప్ మూవీ కావడంతో.. దానికి తగ్గ లోకేషన్లను చాలా కేర్ఫుల్ గా ఎంచుకుంటూ.. షూటింగ్ పూర్తి చేసుకుంటున్నాడు. ఇక ఈ క్రమంలోనే షూట్కు సంబంధించిన ఏ చిన్న లీక్ కూడా బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు జక్కన్న. ఇలాంటి క్రమంలో తాజాగా సినిమా రిలీజ్ డేట్ కు సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్డేట్ నెటింట వైరల్ గా మారుతుంది. ఇప్పటికే సినిమా షూట్ రెండేళ్లలో కంప్లీట్ అవుతుందని.. 2027లో సినిమా రిలీజ్ కావచ్చు అంటూ వార్తలు వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇక టీం సైతం ఇదే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే ఓ అక్కీ డేట్ను లాక్ చేశారని సమాచారం. 2027 సమ్మర్ కానుకగా మార్చి 25న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానుందట.
2027ను టార్గెట్ చేసుకొని షూట్ వేగంగా పూర్తి చేస్తున్నాడట జక్కన. ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే.. రాజమౌళి చివరి మూవీ ఆర్ఆర్ఆర్ కూడా.. 2022 మార్చి 25న రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఎంతటి సంచలనం సృష్టించిందో.. ఏ రేంజ్ లో రికార్డులు క్రియేట్ చేసిందో చెప్పనవసరం లేదు. యావత్ భారతదేశం అంతా ఏళ్లు తరబడి ఎదురు చూస్తున్న ఆస్కార్ను తెచ్చి పెట్టింది. ఈ క్రమంలోనే జక్కన్న మళ్ళీ ఇదే లక్కీ డేట్ను మహేష్ సినిమాకు కూడా ప్లాన్ చేస్తున్నాడని టాక్. ఈ నేపద్యంలో ఆడియన్స్లోను సినిమాపై ఎక్సైట్మెంట్ మరింతగా పెరిగింది. ఇందులో వాస్తవం ఎంతో తెలియాలంటే అఫీషియల్ గా రిలీజ్ డేట్ ప్రకటించే వరకు ఆగాల్సిందే.