అక్కినేని నాగార్జున, కోలివుడ్ స్టార్ హీరో ధనుష్ కలిసి నటించిన తాజా మూవీ కుబేర. ఈ సినిమాకు శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. భారీ అంచనాలతో రూపొ్దిన ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో గ్రాండ్గా రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే సినిమాలు అమీగోస్ క్రియేషన్స్ తో కలిసి.. వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై సునీల్ నారాయణ, పుస్కూర్ రామ్మోహన్ రావు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక.. ఈ సినిమాలో.. రష్మిక మందన హీరోయిన్గా మెరవనుంది. ఇప్పటికే షూట్ ముగించుకొని.. ఆడియన్స్ను పలకరించడానికి సిద్ధమవుతున్న ఈ సినిమా.. రిలీజ్ తేదీ దగ్గర పడుతున్న క్రమంలో.. ప్రమోషన్స్ ప్రారంభించారు టీం.
ఈ క్రమంలోనే తాజాగా చెన్నైలో ఆడియో లాంచ్ ఈవెంట్ గ్రాండ్ లెవెల్లో సెలబ్రేట్ చేసుకున్నారు. ఇందులో భాగంగా ఈవెంట్లో సందడి చేసిన డైరెక్టర్ శేఖర్ కమ్ముల.. సినిమాకు సంబంధించిన ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను షేర్ చేసుకున్నారు. అంతేకాదు.. కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్పై.. ఆయన నటనపై ప్రశంసల వర్షం కురిపించాడు. శేఖర్ కమ్ముల మాట్లాడుతూ.. ఈ సినిమాతో హీరో ధనుష్ కుమార్ ఒకసారి కచ్చితంగా జాతీయ అవార్డు దక్కుతుందంటూ పేర్కొన్నాడు. ఈ సినిమా చాలా చాలా బాగా వచ్చిందని.. ఈ సినిమాలో ధనుష్ నటన వేరే లెవెల్ అంటూ చెప్పుకొచ్చాడు.
ధనుష్ జాతీయ అవార్డు గెలుచుకుంటాడని భావిస్తున్నా అంటూ. . అతను తప్ప మరెవరు ఈ పాత్రలో నటించలేరు.. అంతలా జీవించేసాడంటూ శేఖర్ కమ్ముల వివరించాడు. ఇక నాగార్జున మాట్లాడుతూ ధనుష్ ఒక ఇంటర్నేషనల్ యాక్టర్ అని. . అతనిలో చాలా గొప్ప టాలెంట్ ఉందంటూ చెప్పుకొచ్చాడు. అంతేకాదు.. ధనుష్, శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో అవకాశం ఇస్తే మరోసారి నటించాలని ఉందంటూ నాగార్జున తన అభిప్రాయాన్ని చెప్పకనే చెప్పేసాడు. ప్రస్తుతం నాగార్జున, శేఖర్ కమ్ముల.. ధనుష్ నటనపై ప్రశంసలు కురిపిస్తూ.. నేషనల్ అవార్డు వస్తుందంటూ చేసిన కామెంట్స్ నెటింట వైరల్ గా మారుతున్నాయి.