సినీ ఇండస్ట్రీలో సినిమాకు అంత ఫిక్స్ అయ్యి.. హీరోయిన్ ని కూడా సెలెక్ట్ చేసుకున్న తర్వాత.. కొద్ది రోజులు షూటింగ్ పూర్తయి ఏవో కారణాలతో తర్వాత ఆమెను పక్కన పెట్టేసి.. మరో హీరోయిన్ తీసుకుని మొదటి నుంచి షూట్ చేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అలా నాగార్జున కూడా ఓ మూవి విషయంలో హీరోయిన్కు అన్యాయం చేశాడట. నాగార్జున నటించిన సినిమాలో హీరోయిన్గా ఫిక్స్ అయిన తర్వాత ఆమెను తీసేసి మరో హీరోయిన్ పెట్టుకోవడంతో.. ఆ హీరోయిన్ నాగ్పై శాపనార్దల వర్షం కురిపించింది. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు.. అసలు మేటర్ ఏంటి.. ఒకసారి తెలుసుకుందాం. నాగార్జున డ్యూయల్ రోల్లో నటించి బ్లాక్ బస్టర్ కొట్టిన హలో బ్రదర్ సినిమా అందరికీ గుర్తుండే ఉంటుంది.
ఈ సినిమా ఫ్యాన్స్కి ఇప్పటికీ మోస్ట్ ఫేవరెట్ మూవీ అనడంలో అతిశయోక్తి లేదు. అయితే.. హలో బ్రదర్ సినిమాలో నాగార్జున నటించిన డ్యూయల్ రోల్లో ఒక పాత్ర కోసం సౌందర్య, మరో పాత్ర కోసం రమ్యకృష్ణ మెరిసిన సంగతి తెలిసిందే. అయితే.. ఇందులో మొదట సౌందర్యను ఫిక్స్ చేసి.. ఆ తర్వాత మరో హీరోయిన్గా రంభను భావించారట. ఈ క్రమంలోనే డైరెక్టర్ ఇవీవీ సత్యనారాయణ రంభ డేట్స్ కూడా లాక్ చేసిన తర్వాత.. నాగార్జున సడన్గా ఈ సినిమాలో రంభ వద్దు రమ్యకృష్ణ ని తీసుకుందాం.. రంభను సినిమా నుంచి తీసేయండి అని డిమాండ్ చేశాడట. ఇక స్వయంగా హీరోనే ఇలా చెప్పడంతో.. చేసేదేమీ లేక ఇవివి సత్యనారాయణ కూడా రంభను పక్కన పెట్టేసి రమ్యకృష్ణను తీసుకోవాల్సి వచ్చింది.
ఈ విషయం తెలిసిన రంభ.. హీరో, డైరెక్టర్ల పై కోపంతో చడమడ తిట్టేసిందట. ఈ కోపం చల్లారడానికి.. డైరెక్టర్ సినిమాల్లో స్పెషల్ సాంగ్ చేసే అవకాశం ఇచ్చినా.. రంభ కోపం మాత్రం కాస్త కూడా తగ్గలేదట. ఈ క్రమంలోనే అప్పటి నుంచి నాగార్జునతో మరోసారి సినిమాలో నటించే అవకాశం లేదని.. ఆయన మొహం కూడా చూసేది లేదని.. అలాంటి వాడి సినిమాలో నటించడం ఒక్క చెత్త పని అని శాపనార్థాలు పెట్టిందట. అంతేకాదు.. తర్వాత నాగార్జునతో.. రంభ ఓ సినిమాలో నటించే ఛాన్స్ వచ్చినా రిజెక్ట్ చేసిందట. అప్పటినుంచి నాగార్జున సినిమాలో ఆఫర్ వచ్చిన రంభ ఇప్పటివరకు నటించలేదు.