పవన్ వార్నింగ్ తో వీరమల్లుకు సరికొత్త సమస్య.. టికెట్‌ రేట్లపై ప్ర‌భావం ప‌డ‌నుందా..?

జనసేన అధినేత.. టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎం గా విధులను నిర్వర్తిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయన థియేటర్లో విషయంలో, టికెట్ల విషయంలో కఠినంగా వ్యవహరించనున్న‌ట్లు తెలుస్తుంది. సినిమాలకు సంబంధించి.. వ్యక్తిగతంగా ఎవరు తనను కలవొద్దని.. అవసరమైతే సంకాల ప్రతినిధులు వచ్చి కలవాలని.. ఓపెన్ గా వెల్లడించాడు. పవన్ వార్నింగ్ తో ఊహించని సమస్య ఎదురవనుంది. ముఖ్యంగా పవర్ స్టార్ చేసిన వార్నింగ్ నేపథ్యంలో.. హరిహర వీరమల్లుకే కొత్త సమస్య తలెత్తే అవకాశం ఉందట.

ఇంతకీ అసలు మేటర్ ఏంటంటే.. పవన్ సీరియస్ వార్నింగ్ హరిహర వీరమల్లు టికెట్ రేట్ల పెంపకంపై ప్రభావం చూపనుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. హరిహర వీరమల్లుకు సంబంధించి వ్యక్తిగతంగా ఏ.ఎమ్. రత్నం వచ్చి కలవడానికి.. టికెట్ రేట్లు పెంచాలని కోరడానికి.. తాను పెట్టిన నిబంధనలే అడ్డుగా నిలిచాయి. అయితే.. వీరమల్లు తన సొంత సినిమా కావడంతో.. పవన్ ఈ సమస్యను ఎలా పరిష్కరించుకుంటాడు అనే సందేహాలు అందరిలోనూ మొదలయ్యాయి. వీరమల్లు మూవీకి బాక్సాఫీస్ దగ్గర పెద్దగా పోటీ లేదు. జూన్ 12న రికార్డు లెవెల్లో స్క్రీన్‌లలో ఈ సినిమా రిలీజ్ కానుంది. హరిహర వీరమల్లు డిజిటల్ రైట్స్ కూడా ఇప్పటికే భారీ ధరకు కొనుగోలు అయ్యాయి.

అమెజాన్ ప్రైమ్ ఈ సినిమా హక్కులను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక.. ఈ సినిమాలో.. పవన్ కళ్యాణ్‌కు జంటగా నిధి అగర్వాల్ హీరోయిన్గా మెరుగనుంది. నిధి అగర్వాల్ సినీ కెరీర్‌కు సైతం ఈ సినిమా కీలకంగా మార‌నుందట. రెండు భాగాలుగా హరిహర వీరమల్లు తెర‌కెక్కుతున్న నేపథ్యంలో.. ఫస్ట్ పార్ట్ హీట్ అయితే మాత్రమే సెకండ్ పార్ట్ సెట్స్ పైకి వెళ్లే ఛాన్స్ ఉంది. ఈ క్రమంలోనే హరిహర వీరమల్లు రిలీజ్.. బాక్స్ ఆఫీస్‌ను బ్లాస్ట్ చేసి.. రికార్డులు క్రియేట్ చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు. పవన్ ఐదేళ్ల శ్రమకు తగ్గ ఫలితం వీరమల్లు రూపంలో దక్కుతుందంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లతో రూ.200 కోట్ల షేర్ కలెక్షన్లు సొంతం చేసుకోవాలని అభిమానులు భావిస్తున్నారు.