టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా.. త్రివిక్రమ్ డైరెక్షన్లో రూపొందిన ఖలేజా సినిమా త్వరలోనే రీ రిలీజ్ కు సిద్ధంఅవుతుంది. మే 30న హైదరాబాద్లో గ్రాండ్ లెవెల్లో రీ రిలీజ్ కానున్న ఈ సినిమాకు.. ఇప్పటికే షోస్ హౌస్ఫుల్ పడిపోయాయి. తర్వాత రోజు మే 31 కి కూడా ఫుల్ గా బుక్ అయిపోయాయి. మే 23న ఫ్రీ బుకింగ్స్ ఓపెన్ చేయగా.. గంటకు 14 వేలకు పైగా టికెట్లు అమ్ముడుపోవడం విశేష్. రీ రిలీజ్కు ఈ రేంజ్ బుకింగ్స్ జరగడం అంటే సాధారణ విషయం కాదు.. ఇక ఇప్పటివరకు రీ రిలీజ్ సినిమాలకు ఈ రేంజ్లో బుకింగ్ జరగడం ఇదే మొదటిసారి.
ఇంతకుముందు గబ్బర్ సింగ్ రిలీజ్ కు గంటకు 5.56 కే టికెట్లు అమ్ముడు పోగా.. దీన్ని డబల్ మార్జిన్ తో మహేష్ ఆ రికార్డ్ బ్రేక్ చేశాడు. ఖలేజాకు బీభత్సమైన క్రేజ్ నెలకొంది. థియేటర్లలో కమర్షియల్గా సక్సెస్ సాధించుకున్నా.. టీవీల్లో బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ అందుకున్న ఈ సినిమా.. మహేష్ కామెడీ టైమింగ్, యాక్టింగ్, సాంగ్స్, మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్స్ స్కోర్.. ఇలా అన్నిటిలో ఆడియన్స్ను మెప్పిస్తుంది. ఈ క్రమంలోనే ఖలేజా కల్టి క్లాసిక్గా క్రేజ్ సంపాదించుకుంది. ఈ సినిమాను.. మహేష్ ఫ్యాన్స్ తో పాటు.. మిగిలిన హీరోల అభిమానులు సైతం ఎంజాయ్ చేస్తున్నారు.
దీనికి తాజాగా నమోదైన ప్రీ బుకింగ్స్ సాక్ష్యం అనడంలో అతిశయోక్తి లేదు. ఈ ఫ్రీ బుకింగ్స్లో మహేష్ క్రేజ్ తో.. మాస్ బ్యాటింగ్ చూపిస్తున్నారు. అడ్వాన్స్ బుకింగ్ లో ఈ రేంజ్ జోరు చూపిస్తున్న సినిమాకు మరిన్ని షోస్ యాడ్ అయ్యే అవకాశం కూడా ఉంది. అదే జరిగి సాధ్యమైనంత ఎక్కువ థియేటర్లు ఖలేజా రీలీజ్ అయితే మాత్రం.. డైరెక్ట్ రిలీజ్ కు సిద్ధమవుతున్న భైరవం కంటే ఎక్కువగా వసూళ్ళు రాబట్టడం ఖాయం. ఇక.. ఈ సినిమాకు ఫ్రీ రిలీజ్ బుకింగ్స్ జోరు చూస్తుంటే.. ఈజీగా మొదటి రోజే 8 నుంచి 10 కోట్ల వరకు గ్రాస్ వపూళ్లు చేసే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. మొదటి మూడు రోజుల్లో ఈజీగా రూ.20 కోట్ల గ్రాస్ రాబట్టొచ్చు. 2010లో ఈ సినిమాకు రూ.18 కోట్ల వసూళ్లు రాగా.. ఈ రీ రిలీజ్లో.. దీన్ని ఈజీగా ఖలేజా బ్రేక్ చేస్తుందనడంలో సందేహం లేదు.