మెగా డాటర్ నిహారిక ప్రస్తుతం టాలీవుడ్లో ఫుల్ జోష్తో రాణిస్తున్నారు. ఆమె.. మొదటిసారి నిర్మాతగా మారి.. తెరకెక్కించిన కమిటీ కుర్రాళ్ళు సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎంత పెద్ద సూపర్ హిట్గా నిలిచిందో తెలిసిందే. నిహారిక ప్రొడక్షన్లో పింక్ పిక్చర్స్ దామోధర్ బ్యానర్ పై.. కమిటీ కుర్రాళ్ళు సినిమాను రూపొందించారు. ఈ సినిమాకు యదు వంశీ దర్శకత్వం వహించగా.. ఆగస్టు 9న రిలీజ్ అయిన ఈ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకోవడంతో నిహారిక సైతం ఆనందాన్ని వ్యక్తం చేసింది. తొలి సినిమాతోనే సక్సెస్ కొట్టిన నిహారిక.. ఫుల్ జోష్లో రాణిస్తుంది.
ఇక నిహారిక పర్సనల్ లైఫ్ తెరిచిన పుస్తకమే. మొదట టీవీ షోలో హోస్టుగా కనిపించిన నిహారిక.. తర్వాత వెండితెరపై హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. ఒక మనస్సు, సూర్యకాంతం, హ్యాపీ వెడ్డింగ్ సినిమాల్లో నటించి తన నటనతో మంచి మార్కులు కొట్టేసింది. అయితే.. సినిమాలతో ఊహించిన రేంజ్ లో సక్సెస్ అందుకోలేకపోయింది. ఈ క్రమంలోనే పెళ్లి పీటలకి వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టింది. జొన్నలగడ్డ చైతన్యను ప్రేమించే వివాహం చేసుకుంది. అయితే వీరిద్దరి కాపురం ఎక్కువ కాలం నిలవలేదు. మనస్పర్ధలు కారణంగా ఇద్దరు.. ఒకరితో ఒకరు విడాకులు తీసుకుని అభిమానులకు షాక్ ఇచ్చారు.
ఈ క్రమంలోనే విడాకుల తర్వాత నిహారిక తిరిగి మళ్లీ తన కెరీర్ పై ఫోకస్ చేసింది. ప్రస్తుతం హీరోయిన్గా రెండు సినిమాల్లో నటిస్తున్న ఈ అమ్మడు.. మరోసారి తన ప్రొడక్షన్లో సినిమాలు చేయడానికి కూడా సిద్ధమవుతుంది. ఇదిలా ఉంటే.. నిహారిక తాజాగా సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ నెటింట తెగ వైరల్గా మారుతుంది. ఇది నాకు అత్యంత సంతోషకరమైన రోజు అంటూ.. ఓ బాబుని ఎత్తుకున్న ఫోటోను.. నిహారిక అభిమానులతో పంచుకుంది. ఆ బాబుతో ఎంతో ఆనందంగా ఉన్నా ఆ ఫోటోలో.. తను ముసి ముసి నవ్వులతో మెరిసింది. అయితే ఆ బాబు ఎవరు.. తనకు ఏమవుతాడు.. అని దానిపై మాత్రం నిహారిక ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. దీంతో ప్రస్తుతం ఇంతకీ ఆ బాబు ఎవరై ఉంటారు అనే సెర్చింగులు మొదలు పెట్టేసారు నెటిజెన్స్.