ఇండస్ట్రీలో మ్చి ఇమేజ్ ఉన్న మంచు ఫ్యామిలీ గత కొద్ది రోజులుగా ఏ రేంజ్ లో కాంట్రవర్సీలతో వైరల్ అవుతున్నారు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నిన్న మొన్నటి వరకు మంచు మనోజ్ బయటకు వచ్చి మోహన్ బాబు యూనివర్సిటీలో అవకతవకలు జరుగుతున్నాయని, అక్రమాలు జరుగుతున్నాయని.. ఆస్తుల కోసం కాదు.. నా పోరాటం విద్యార్థుల భవిష్యత్తు కోసం అంటూ రోడ్డు ఎక్కిన సంగతి తెలిసిందే. మోహన్ బాబు దగ్గర నమ్మకం గా ఉండే వ్యక్తితో పాటు, విష్ణు కూడా దీనికి కారణమని.. విష్ణు తండ్రికి తెలియకుండా ఎన్నో గోరాలు చేస్తున్నాడు అంటూ మనోజ్ మీడియా ముందు ఆరోపణలు చేశాడు.
అంతేకాదు మోహన్ బాబు యూనివర్సిటీ ఫీజుల విషయంలో విద్యార్థుల తల్లిదండ్రుల సైతం ఏఐసిటీఈ కి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఇలా ఇప్పటికే రకరకాల ఆరోపణలను ఎదుర్కొంటూ.. వివాదాల్లో చిక్కుకున్న మోహన్ బాబు యూనివర్సిటీలో.. తాజాగా మరో వివాదం చోటుచేస్తుంది. ఓ విద్యార్థిని కిడ్నాప్ చేసిన ఇష్యూ ప్రస్తుతం తెగ వైరల్ గా మారుతుంది. మోహన్ బాబు యూనివర్సిటీలో చదువుకునే జేమ్స్ అనే వ్యక్తి ఒక సెల్ఫీ వీడియో ద్వారా తనకు జరిగిన అన్యాయాన్ని వెల్లడించాడు. అందులో జేమ్స్.. తనకంటే జూనియర్ అయిన యశ్వంత్ తనను కిడ్నాప్ చేయించి చిత్ర హింసలు చేశాడట. జేమ్స్ని యశ్వంత్ ప్రతిసారి కులం పేరుతో దూషిస్తున్నారంటూ వెల్లడించాడు.
అయితే.. చాలా రోజులు ఓపిక పట్టిన జేమ్స్.. తర్వాత ఓసారి యశ్వంత్ కి వార్నింగ్ ఇచ్చాడట. దాన్ని తట్టుకోలేకపోయిన యశ్వంత్.. జేమ్స్ పై కోపంతో 13వ తేదీన జెమ్స్ను రౌడీ షీటర్లతో కలిసి కిడ్నాప్ చేసి.. ఒక రూమ్లో బందించి మరీ చిత్రహింసలు పెట్టడట. రెండు రోజులపాటు వేధించడమే కాదు.. మూత్రం కూడా తాగించి.. కిరాతకంగా ప్రవర్తించాడట. ఈ మేరకు జేమ్స్.. సెల్ఫీ వీడియోను షేర్ చేసుకోవడంతో.. జేమ్స్ ఫిర్యాదు మేర కేసు నమోదు చేసిన తిరుచానూరు పోలీసులు విచారణ చేపట్టారు. ఇక ప్రస్తుతం ఈ వీడియో వైరల్గా మారుతున్న క్రమంలో మరో వివాదంలో మోహన్ బాబు యూనివర్సిటీ హాట్ టాపిక్గా మారింది.
మోహన్ బాబు యూనివర్సిటీ విద్యార్థి జేమ్స్ ను కిడ్నాప్ చేసి దాడి..
తన జూనియర్ యశ్వంత్ కులం పేరుతో దూషిస్తూ అవమానిస్తుంటే మందలించిన జేమ్స్..
13వ తేది మంగళం దగ్గర యశ్వంత్ కొందరు రౌడీ షీటర్లు తనను కిడ్నాప్ చేశారన్న జేమ్స్..
రెండు రోజులు ఓ గదిలో బంధించి చిత్రహింసలకు గురి చేశారని… pic.twitter.com/sD721sghJ1— RTV (@RTVnewsnetwork) May 17, 2025