టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్గా ఇమేజ్ ను క్రియేట్ చేసుకుని.. మాస్ డైరెక్టర్ గా దుమ్ము దులుపుతున్న వారిలో మొదట వినిపించే పేరు బోయపాటి శ్రీను. తనదైన రీతిలో ఇమేజ్ను క్రియేట్ చేసుకోవడమే కాదు.. హీరోలను మాస్గా ఎలివేట్ చేయడంలో తనకు సాటి మరొకరు లేరు అనే రేంజ్ లో సత్తా చాటుతున్నాడు. ఇక ప్రస్తుతం బోయపాటి, బాలయ్య కాంబోలో నాలుగో సారి సినిమా సెట్స్పైకి వస్తున్న సంగతి తెలిసిందే. గతంలో బాలయ్య, బోయపాటి కాంబోలో వచ్చిన అఖండ బ్లాక్ బస్టర్ కావడంతో.. ఈ సినిమాకు సీక్వెల్గా అఖండ 2 తాండవం ను తెరకెక్కించే పనిలో బిజీగా ఉన్నారు మేకర్స్. అయితే.. బాలయ్య ప్రస్తుతం బాబితో డాకు మహారాజ్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.
ఈ సినిమా తుది దశకు చేరుకుంది. ఈ క్రమంలోనే సినిమా కంప్లీట్ అయిన వెంటనే అఖండ 2 షూట్లో బాలయ్య ఎంట్రీ ఇవ్వనన్నాడట. ప్రస్తుతం ఒక పక్కన సినిమాల్లో నటిస్తూనే.. మరోపక్క అన్స్టాపబుల్ సీజన్ 4లో బిజీగా ఉంటున్న బాలయ్య.. డాకు మహారాజ్ పూర్తయిన వెంటనే.. కంటిన్యూస్గా అఖండ సెట్స్లో పాల్గొని 2025 ఎండింగ్ కల్లా సినిమాను రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నాడట. ఏది ఏమైనా తనకంటూ ప్రత్యేక స్టైల్ లో సినిమాలో నటిస్తూ బిజీగా గడుపుతున్న బాలయ్య.. ఇకపై వరుస సినిమాలను చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తుంది. అందుకే అఖండ 2 నుంచే సినిమాల విషయంలో తన దూకుడు పెంచనున్నాడట.
దానికి తోడు బాలయ్య కొడుకు మోక్షజ్ఞ కూడా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇస్తున్న క్రమంలో.. బాలయ్య ఇప్పుడు వరుస సినిమాలను లైన్లో పెడుతున్నాడని.. ఏజ్ పెరిగే కొద్దీ ఆయనకు సినిమా అవకాశాలు తగ్గే ఛాన్స్ ఉంది. అందుకే ప్రస్తుతం రెస్ట్ అన్నది లేకుండా సినిమాలతో బిజీ అయిపోవాలని ప్లాన్ చేస్తున్నాడట. ఏది ఏమైనా తనదైన స్టైల్ లో సత్తా చాటుతున్న బాలయ్య.. మరిన్ని సినిమాలు చేయాలని.. ఫ్యాన్స్ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. అఖండ 2 తో మరోసారి బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకొని నందమూరి నటసింహం సత్తా బాక్స్ ఆఫీస్కు తెలిసేలా ప్రూఫ్ చేయాలంటూ కామెంట్లు చేస్తున్నారు.