కొన్ని కాంబినేషన్లలో సినిమా సెట్ అయితే బాగుండు ఎంతోమంది అభిమానులు ఎదురు చూస్తూ ఉంటారు. ఇద్దరు స్టార్ హీరోస్ కలిసి ఓ మల్టీస్టారర్లో నటిస్తున్నారంటే ఫ్యాన్స్ ఆనందానికి హద్దులు ఉండవు. అలా టాలీవుడ్ లో మోస్ట్ అవైటెడ్ గా చూస్తున్న కాంబోలో చిరంజీవి, బాలకృష్ణ కాంబినేషన్ కూడా ఒకటి. వీళ్ళిద్దరి కాంబోలో ఓ సినిమా వస్తే బాగుండని ఎప్పటినుంచో ఆడియన్స్ ఎదురుచూస్తున్నారు. అలాగే చిరంజీవి, త్రివిక్రమ్ కాంబోలో సినిమా వచ్చిన బాగుందని ఎంతోమంది అభిమానులు తమ అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉంటారు. ఇక చిరంజీవి, బోయపాటి కాంబోలో సినిమా వస్తే చూడాలని ఆడియన్స్ ఎక్సైట్ అవుతూ ఉంటారు.
కాగా గతంలో చిరంజీవికి.. త్రివిక్రమ్ జై చిరంజీవ సినిమాల్లో మాటలు అందించిన సంగతి తెలిసిందే. బోయపాటితో మాత్రం మెగాస్టార్కు ఇప్పటివరకు ఒక్క సినిమా కూడా సెట్ కాలేదు. ఇక గతంలో బోయపాటి ఇంటర్వ్యూలో చిరంజీవితో సినిమా చేయాలనుంది అంటూ.. దానికోసం కథ కూడా సిద్ధం చేసుకున్నట్లు చెప్పుకొచ్చాడు. ఇప్పటికే బోయపాటి.. టాలీవుడ్లో హీరోకి ఊరమాస్ ఎలివేషన్స్ ఇచ్చే దర్శకుడుగా నెంబర్ వన్ పొజిషన్లో ఉన్నాడు. అలాంటి బోయపాటి.. చిరంజీవి కోసం కథ రాసుకునే ఉంచిన అది సెట్ కాలేదు. కారణం బాలకృష్ణతో తెరకెక్కించిన అఖండ సినిమా అని తెలుస్తుంది. బాలకృష్ణ, బోయపాటి కాంబోలో వచ్చిన అఖండ టాలీవుడ్లో ఎలాంటి సంచలనం సృష్టించిందో తెలిసిందే. అటు బాలయ్య, ఇటు బోయపాటి కెరీర్ లోను బిగ్గెస్ట్ హిట్గా నిలిచింది.
బాలయ్యను విభిన్నమైన పాత్రలో అఘోరగా చూపించాడు బోయపాటి. ఈ క్రమంలోనే సినిమా సక్సెస్ సాధించడంతో బోయపాటి నెక్స్ట్ సినిమాలపై ఆడియన్స్లో విపరీతమైన అంచనాలు పెరిగిపోయాయి. అయితే చిరంజీవి కోసం రాసుకున్న కథ అఖండ ముందు బోయపాటి రాసిన కథ కావడంతో.. ఆడియన్స్ అఖండను మించిన భారీతనం తన నెక్స్ట్ రాబోయే సినిమాలో కోరుకుంటారు. కనుక చిరంజీవి గారితో సినిమా అఖండను మించి ఉండేలా రాసుకోవాలి. అందుకే చిరంజీవి గారి కోసం రాసిన కథ సెట్ కాలేదు అంటూ బోయపాటి చెప్పుకొచ్చాడు. అఖండకు ముందు రాసుకున్న కథ మాత్రం ఇంకా వర్క్ అవుట్ కాదంటూ వెల్లడించాడు. ప్రస్తుతం బోయపాటి, బాలయ్యతో అఖండ2 వీరతాండవం సినిమా తెరకెక్కించేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ సినిమా తర్వాత అయినా చిరంజీవి కోసం అంతకు మించిన పవర్ఫుల్ కథను రాసుకుంటాడో.. లేదో.. అసలు సినిమాను సెట్స్పైకి తీసుకువస్తాడో.. లేదో.. చూడాలి.