టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా మంచి ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న విజయనిర్మల తిరుగులేని లేడీ స్టార్ డైరెక్టర్ గాను మంచి ఇమేజ్ను క్రియేట్ చేసుకుంది. తెలుగులో ఏకంగా 44 సినిమాలు తెరకెక్కించి విజయనిర్మల రికార్డ్ క్రియేట్ చేసింది. ఆమె తీసిన దాదాపు అన్ని సినిమాలు మంచి సక్సెస్ అందుకున్నాయి. ఇక విజయనిర్మల తర్వాత మళ్లీ అంతటి క్రేజ్ దక్కింది లేడీ డైరెక్టర్ నందిని రెడ్డికి మాత్రమే. ఈమె కూడా.. ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన కొత్తలో వరుసగా తెలుగు సినిమాలను తెరకెక్కిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంది. అలా మొదలైంది సినిమాతో డైరెక్టర్గా కెరీర్ను ప్రారంభించిన నందిని రెడ్డి.. ఈ సినిమాకు సొంతంగా కథని అందించింది.
రొమాంటిక్ కామెడీ ఫిలింగా రూపొందిన ఈ సినిమాలో నేచురల్ స్టార్ నాని, నిత్యమీనన్ జంటగా నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత నందిని రెడ్డికి ఒకసారిగా మంచి ఇమేజ్ క్రియేట్ అయింది. ఈ క్రమంలోనే 2013లో మరో రొమాంటిక్ కామెడీ మూవీ జబర్దస్త్.. తెరకెక్కించింది. సమంత, సిద్ధార్థ్, నిత్యమీనన్ హీరో హీరోయిన్లుగా నటించి ఆకట్టుకున్నారు. ఇక సినిమాలో నాగశౌర్య, మాళవిక నాయర్, రాసి, ఐశ్వర్య తమ పర్ఫామెన్స్ తో ఆకట్టుకున్నారు. విమర్శకులు సైతం సినిమాకు ప్రశంసలు అందించారు. నందిని రెడ్డి దర్శకత్వం వహించిన మరో ఫాంటసీ కామెడీ మూవీ ఓ బేబీ. ఈ సినిమా ఎలాంటి సక్సెస్ అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమాల్లో సమంత, లక్ష్మి ప్రధాన పాత్రలో నటించారు. ఇప్పటికే ఆడియన్స్ సినిమా బుల్లితెరపై వస్తే చాలా ఎంజాయ్ చేస్తూ చూస్తూ ఉంటారు.
ఇది ఓ కొరియన్ సినిమా అయినా.. టాలీవుడ్ ఆడియన్స్ మెచ్చేలా రీమేక్ చేయడం నిజంగా గొప్ప విషయం అని చెప్పాలి. అలా వరుసగా సూపర్ హిట్ లో అందుకుంటూ వచ్చిన నందిని రెడ్డి.. ఓ బేబీ సినిమా తర్వాత పలు సినిమాలను తెరకెక్కించిన ఊహించిన సక్సెస్ అందుకోలేక పోయింది. ఓ బేబీ తర్వాత పిట్ట కథలు సినిమా నెట్ఫ్టిక్స్ ద్వారా రిలీజ్ అయింది. దీనికి మిక్స్డ్ రియాక్షన్ వచ్చింది. సినిమా చాలా అద్భుతంగా ఉందని క్రిటిక్స్ వెల్లడించిన ఊహించిన సక్సెస్ మాత్రం అందలేదు. ఇక సినిమాకు నందిని రెడ్డి దర్శకురాలని.. ఇదో సినిమా వచ్చిందని కూడా చాలామందికి తెలియదు. ఇక 2023లో ఆమె తీసిన అన్ని మంచి సుకునాలే సినిమా అట్టర్ ఫ్లాప్గా నిలిచింది. ఎమోషనల్ డ్రామాగా రూపొందిన సినిమా ఆడియన్స్ను ఆకట్టుకోలేకపోయింది. ఈ సినిమాలో హీరో, హీరోయిన్ మధ్య సాగే ప్రేమ కథ చాలా బోరింగ్ గా అనిపించిందని.. సన్నివేశాలు లాగ్ చేసినట్లు అనిపించిందని ఆడియన్స్ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఇలాంటి సినిమాలు నందిని రెడ్డి తీసింది అంటూ షాక్ అయ్యారు. అప్పటినుంచి ఇప్పటివరకు నందిని రెడ్డి నుంచి మరో సినిమా రానేలేదు. దాదాపు రెండేళ్లు పూర్తవుతున్న నందిని రెడ్డి నుంచి సినిమాలు రాకపోవడం అభిమానులకు నిరాశ మిగిలింది.